Nara Devansh: నారా దేవాన్ష్‌ పుట్టినరోజు.. తితిదేకు లోకేశ్‌-బ్రాహ్మణి విరాళం

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తనయుడు దేవాన్ష్‌ పుట్టినరోజు (మార్చి 21) సందర్భంగా తితిదేకు విరాళం అందింది.

Published : 21 Mar 2023 12:52 IST

తిరుమల: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తనయుడు దేవాన్ష్‌ పుట్టినరోజు (మార్చి 21) సందర్భంగా తితిదేకు విరాళం అందింది. ఒకరోజు అన్నప్రసాద వితరణకు రూ.33లక్షల విరాళాన్ని నారా లోకేశ్‌- బ్రాహ్మణి తరఫున కుటుంబసభ్యులు తితిదే అధికారులకు అందజేశారు. ఏటా దేవాన్ష్‌ పుట్టినరోజున అన్న ప్రసాద వితరణకు విరాళం ఇవ్వడం ఆ కుటుంబానికి ఆనవాయితీగా వస్తోంది. నారా దేవాన్ష్‌ పేరిట విరాళం ఇచ్చిన నేపథ్యంలో ఆ విషయాన్ని తెలుపుతూ తిరుమలలోని శ్రీవారి ఆలయ పరిసరాల్లోని డిస్‌ప్లే బోర్డుల్లో ప్రదర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని