Nara Lokesh: మంచి మిత్రుడిని కోల్పోవడం బాధాకరం: నారా లోకేశ్‌

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తెదేపా నేత, మాజీ ఎంపీపీ రాజవర్ధన్‌రెడ్డి కుటుంబాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పరామర్శించారు.

Updated : 02 May 2022 15:02 IST

కర్నూలు: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తెదేపా నేత, మాజీ ఎంపీపీ రాజవర్ధన్‌రెడ్డి కుటుంబాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పరామర్శించారు. కర్నూలు నెహ్రూనగర్‌లో రాజవర్ధన్‌ ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. రాజవర్ధన్‌ తండ్రి, ఇతర కుటుంబసభ్యులను లోకేశ్ ఓదార్చారు. 

అనంతరం లోకేశ్‌ మీడియాతో మాట్లాడారు. రోడ్డుప్రమాదంలో రాజవర్ధన్‌లాంటి యువనాయకుడు, మంచి మిత్రుడిని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ఏరోజూ ఆయన సొంత పనుల కోసం తనను కలవలేదని చెప్పారు. చిన్నవయసులోనే రాజవర్ధన్‌ చనిపోయారని.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని లోకేశ్‌ ఆకాంక్షించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు