Nara Lokesh: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేశ్‌

తిరుమల శ్రీవారిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దర్శించుకున్నారు. రేపటి నుంచి ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో స్వామి వారి దర్శనం చేసుకున్నారు.

Updated : 26 Jan 2023 11:13 IST

తిరుమల: తిరుమల శ్రీవారిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దర్శించుకున్నారు. రేపటి నుంచి ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో స్వామి వారి దర్శనం చేసుకున్నారు. లోకేశ్‌ తిరుమల రాక సందర్భంగా పెద్ద ఎత్తున తెదేపా నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. 

లోకేశ్‌ తిరుమల నుంచి నేరుగా కుప్పం వెళ్లనున్నారు. రేపు ఉదయం అక్కడి శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ‘యువగళం’ పాదయాత్రను ప్రారంభిస్తారు. మరోవైపు పాదయాత్రకు తెదేపా నేతలు ఏర్పాట్లు పూర్తిచేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని