పోలీసులు కొట్టడం వల్లే కిరణ్‌ మృతి: లోకేశ్‌

మాస్క్‌లేదని పోలీసులు కొట్టడం వల్లే కిరణ్‌ మృతి చెందాడని తెదేపా నేత నారా లోకేశ్‌ ఆరోపించారు. కిరణ్‌ మృతి ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు లేఖ రాశారు. ..

Updated : 06 Feb 2021 19:34 IST

అమరావతి: మాస్క్‌ లేదని పోలీసులు కొట్టడం వల్లే కిరణ్‌ మృతి చెందాడని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. కిరణ్‌ మృతి ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు లేఖ రాశారు. ఎస్సీలపై అక్రమ కేసులు, దౌర్జన్యాలు నిత్యకృత్యంగా మారాయని మండిపడ్డారు. ఎస్సీల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఎస్సీలపై దాడులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని, ప్రకాశం జిల్లాలోని చీరాలకు చెందిన ఎస్సీ యువకుడు కిరణ్‌ కుటుంబానికి న్యాయం చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని