KTR: ప్రపంచంలోని టాప్‌ 5 ఐటీ కంపెనీలకు రెండో అతిపెద్ద కేంద్రం హైదరాబాదే: కేటీఆర్‌

ప్రపంచంలోని టాప్‌ 5 ఐటీ కంపెనీలు తమ రెండవ అతిపెద్ద కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.  ప్రపంచ దిగ్గజ

Updated : 30 Jun 2022 17:01 IST

హైదరాబాద్‌: ప్రపంచంలోని టాప్‌ 5 ఐటీ కంపెనీలు తమ రెండవ అతిపెద్ద కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.  ప్రపంచ దిగ్గజ ఐటీ, ఫైనాన్స్‌ కంపెనీలు తమ సంస్థలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాయన్నారు. నివాసానికి అత్యంత అనువైన ప్రాంతంగా హైదరాబాద్‌ నిలుస్తోందన్నారు. హెచ్‌ఐసీసీలో నాస్కామ్‌ 12వ ఎడిషన్‌ జీసీసీ కాంక్లేవ్‌లో కేటీఆర్‌ పాల్గొన్నారు. 3 రోజులుగా ఈ కాంక్లేవ్‌ జరుగుతోంది. ఇందులో వివిధ నగరాలకు చెందిన ఐటీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ... హైదరాబాద్‌లో ఐటీ గ్రోత్‌ గణనీయంగా పెరుగుతోందన్నారు. 

ఇతర సిటీలతో పోలిస్తే హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పన బాగుందన్నారు. బెంగళూరులో ట్రాఫిక్‌ సమస్య, చెన్నైలో తేమ ఎక్కువ, ముంబయి ఖర్చుతో కూడుకున్న నగరం... అలాగే అక్కడ రాజకీయ అనిశ్చితి ఉంటుందన్నారు. కొత్త సంస్థలు ఏర్పాటు చేయడానికి హైదరాబాద్‌ అద్భుతమైన కేంద్రంగా మారిందన్నారు. అత్యున్నతమైన బిజినెస్‌ స్కూల్స్‌ హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. పరిశ్రమలకు అనువైన పాలసీలను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందని వెల్లడించారు. టీహబ్‌, వీహబ్‌ ద్వారా స్టార్టప్స్‌కి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని స్పష్టం చేశారు. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ఎమర్జింగ్‌ టెక్నాలజీ వింగ్‌ ఏర్పాటు చేశామన్నారు. టాస్క్‌ ద్వారా డిగ్రీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు స్కిల్స్‌ ఇప్రూవ్‌ చేస్తున్నామని తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు 15 రోజుల్లో అన్నిరకాల అనుమతులు వస్తున్నాయని వివరించారు. ఎన్నికల టైమ్‌లో కేవలం 6 నెలలు మాత్రమే రాజకీయాలపై దృష్టి పెట్టి.. మిగతా నాలుగున్నరేళ్లపాటు రాష్ట్ర అభివృద్ధి, ఆర్టికవృద్ధి, ఉద్యోగకల్పనపై దృష్టి పెడతామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని