Covid vaccination: టీకా విషయంలో అంతరం తగ్గించండి
కొవిడ్ టీకా విషయంలో పురుషులు, స్త్రీలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలని జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) తాజాగా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కమిషన్ ఛైర్పర్సన్ రేఖ శర్మ పేర్కొన్నారు. పెద్దఎత్తున మహిళలు టీకా కేంద్రాలకు తరలేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
దిల్లీ: కొవిడ్ టీకా విషయంలో పురుషులు, స్త్రీలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) తాజాగా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కమిషన్ ఛైర్పర్సన్ రేఖా శర్మ పేర్కొన్నారు. పెద్దఎత్తున మహిళలు టీకా కేంద్రాలకు తరలేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తద్వారా ఈ అంతరాన్ని తగ్గించొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ ఆవశ్యకతను వివరించడంతోపాటు అపోహలను తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆయా ప్రభుత్వాలకు సూచించారు. ‘నేటికీ చాలా ఇళ్లలో పురుషులతో పోల్చితే మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఇంట్లో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే.. వారి బాగోగులు చూసుకునేది మహిళలే. ఈ క్రమంలో ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం వారికే ఎక్కువగా ఉంది’ అని లేఖలో పేర్కొన్నారు. వయసు మళ్లిన మహిళల్లో వ్యాక్సినేషన్ అంతరం ఎక్కువగా ఉన్నట్లు ఇటీవల తేలడంతో ఈ మేరకు ఆమె లేఖలు రాశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా