Andhra News: కొత్త జిల్లాలకు కలెక్టర్ల నియామకం

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో మరో ముందడుగు పడింది. రాష్ట్రంలోని 26 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది...

Updated : 02 Apr 2022 23:37 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో మరో ముందడుగు పడింది. రాష్ట్రంలోని 26 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా సుమిత్‌కుమార్‌, అనకాపల్లి జిల్లాకు రవి సుభాష్‌, కాకినాడ జిల్లా కలెక్టర్‌గా కృతికా శుక్లా, తూర్పుగోదావరి జిల్లాకు మాధవీలత, కోనసీమ జిల్లాకు హిమాన్షు శుక్లా, పశ్చిమ గోదావరి జిల్లా పి.ప్రశాంతి, ఏలూరుకు ప్రసన్న వెంకటేశ్‌, మన్యం జిల్లా కలెక్టర్‌గా నిశాంత్‌ కుమార్‌ను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.  ఇప్పటికే విధులు నిర్వర్తిస్తున్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లా కలెక్టర్లు వారి స్థానాల్లో యధావిధిగా కొనసాగుతారని తెలిపింది. మరిన్ని జిల్లాల కలెక్టర్ల వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని