బిల్లు ₹2 వేలు.. టిప్పు ₹11 లక్షలు..!
ఏదైనా హోటల్కు వెళ్తే బిల్లు చెల్లించే సమయంలో సర్వర్ టిప్పు అడగడం ఈ రోజుల్లో సాధారణమే. చాలామంది తాము చెల్లించే బిల్లులో 10 నుంచి 20 శాతం సొమ్మును టిప్పుగా ఇస్తుంటారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏదైనా హోటల్కు వెళ్తే బిల్లు చెల్లించే సమయంలో సర్వర్ టిప్పు అడగడం ఈ రోజుల్లో సాధారణమే. చాలామంది తాము చెల్లించే బిల్లులో 10 నుంచి 20 శాతం సొమ్మును టిప్పుగా ఇస్తుంటారు. కొందరు అంతకన్నా ఎక్కువ ఇస్తే.. అసలేమీ ఇవ్వనివారినీ మనం చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి తాను చెల్లించాల్సిన బిల్లు కంటే దాదాపు 400 రెట్లు డబ్బును టిప్పుగా ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. తన ఉనికిని సైతం గోప్యంగా ఉంచాడు. అయితే ఇది జరిగింది అమెరికాలోని న్యూ హాంప్షైర్లోని ఓ రెస్టారెంట్లో. ఆ బిల్లు ఫొటోను రెస్టారెంట్ యజమాని ఫేస్బుక్లో పోస్టు చేయడంతో అది వైరల్గా మారింది. నెటిజన్లంతా ఆ కస్టమర్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
న్యూ హాంప్షైర్లోని స్టంబుల్ ఇన్ బార్ అండ్ రెస్టారెంటుకు ఇటీవల ఓ కస్టమర్ వచ్చాడు. ఓ పానీయం, మరికొన్ని ఆహార పదార్థాలను ఆర్డర్ చేశాడు. అందుకు బిల్లు 37 డాలర్లు (సుమారు రూ.2700) అయ్యిందంటూ రెస్టారెంటులో వెయిటర్గా పని చేస్తున్న ఓ మహిళ దానిని అయనకు ఇచ్చింది. దానిపై ఆ కస్టమర్ టిప్పుగా 16 వేల డాలర్లు (సుమారు రూ.11 లక్షలు) ఇస్తున్నట్లు రాశాడు. ‘ఈ డబ్బును అంతా ఒకే చోట ఖర్చు చేయకు’ అని ఆయన చెప్పడంతో ఆ మహిళ దానిని చూసింది. అంతే.. అందులో టిప్పుగా రాసిన మొత్తాన్ని చూసి ఆమె అవాక్కయింది. విషయం తెలుసుకున్న రెస్టారెంట్ యజమాని ఆ టిప్పును తన సిబ్బందికి పంచాడు. ఆయన దాతృత్వాన్ని కొనియాడుతూ ఫేస్బుక్లో ఆ బిల్లు ఫొటోను షేర్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?