వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో దారుణం

వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం

Updated : 09 Jul 2021 15:08 IST

హైదరాబాద్: వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన చిన్నారి మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. ఈ నెల 5న ఆస్పత్రిలో చేర్పించుకుని పురిటినొప్పులు వచ్చినప్పటికీ పట్టించుకోకుండా వైద్యులు నిర్లక్ష్యం చేశారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల తర్వాత ఆపరేషన్‌ చేశారని, పుట్టిన బాబు ఉమ్మనీరు తాగి మృతి చెందినట్లు చెప్పారని మండిపడ్డారు. వైద్యులు సమయానికి ఆపరేషన్‌ చేయకుండా బాబు మృతికి కారణయ్యారని బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని