Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లోని టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..
1. ‘మీ వెంటే నేను’.. అమరావతి రైతులకు సోనూసూద్ మద్దతు
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ 632 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు సినీనటుడు సోనూసూద్ మద్దతు ప్రకటించారు. విజయవాడ పర్యటనకు వచ్చిన సోనూసూదన్ను గన్నవరం విమానాశ్రయంలో మహిళా రైతులు కలిశారు. తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరగా... రైతుల వెంటే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. రాజధాని గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, పెదపరిమి దీక్షా శిబిరాల్లో నిరసన తెలిపారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.
చెల్లెకు న్యాయం చేయలేని సీఎం రాష్ట్రానికి ఏం చేస్తారు?: లోకేశ్
2. ఏపీ 34 టీఎంసీలకు మించి తీసుకోకుండా చూడాలి: తెలంగాణ
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ బోర్డు ఛైర్మన్కు పోతిరెడ్డిపాడు, శ్రీశైలం కుడి కాలువ ద్వారా ఏపీకి నీటి విషయంలో లేఖ రాశారు. ఏపీ 34 టీఎంసీలకు మించి నీరు తీసుకోకుండా చూడాలని కోరారు. 880 అడుగులపైన నీరు ఉన్నప్పుడూ ఏపీ 34 టీఎంసీలే తీసుకోవాలని లేఖలో వివరించారు. ఏపీ చేపట్టిన అన్ని ప్రాజెక్టులను గెజిట్లో చేర్చాలని ఈఎన్సీ లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు పనులను గెజిట్లో రెండో షెడ్యూల్లో చేర్చాలని కోరారు.
3. మహిళలపై నేరాల విషయంలో రాజకీయాలా?: సుచరిత
దేశంలో మహిళల భద్రతకు యాప్ తీసుకొచ్చిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. దిశ చట్టం, యాప్పై మహిళల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. తాడేపల్లిలో సీఎం జగన్తో సమావేశం అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. లోకేశ్ పర్యటనను అడ్డుకోవడం సహా తాజా పరిణామాలపై చర్చించినట్లు చెప్పారు. మహిళల భద్రత, అత్యాచార ఘటనల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు చెప్పారు. నరసరావుపేటలో అనూష హత్య జరిగిన 7 నెలలకు నారా లోకేశ్ పరామర్శకు వచ్చారని.. హత్య జరిగిన 7 రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు మంత్రి చెప్పారు.
4. రియల్మీ కొత్త ఫోన్లు.. ధర.. ఫీచర్లివే!
రియల్మీ కంపెనీ రెండు కొత్త స్మార్ట్ఫోన్లలను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రియల్మీ 8ఐ, రియల్మీ 8ఎస్ 5జీ పేరుతో వీటిని తీసుకొచ్చింది. ఈ రెండు మోడల్స్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్మీ యూఐ 2.0 ఓఎస్తో పనిచేస్తాయి. ఈ ఫోన్లో 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్తో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఇస్తున్నారు. ఈ డిస్ప్లేలో 6 రకాల రిఫ్రెష్ రేట్లు ఉన్నాయి. ఇవి ఫోన్లో మనం చూసే వీడియోను బట్టి మారుతుంటాయి. మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్ ఉపయోగించారు. 5జీబీ వర్చువల్ ర్యామ్ ఇస్తున్నారు. ఇది ఫోన్ స్టోరేజీ నుంచి కొంత స్టోరేజ్ను వాడుకుని ఫోన్లో ఉన్న ర్యామ్ మరింత వేగంగా పనిచేసేందుకు సాయపడుతుంది.
5. ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు పొడిగింపు
పన్ను చెల్లింపుదారులకు కేంద్రం మరోసారి ఊరట కల్పించింది. ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు గడువును పెంచింది. 2021-22 మదింపు సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేయడానికి డిసెంబర్ 31వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్టు సీబీడీటీ గురువారం ప్రకటించింది. కరోనా వైరస్తో నెలకొన్న పరిస్థితుల కారణంగా గతంలో సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు, ఐటీ రిటర్నుల దాఖలు కోసం ఇన్ఫోసిస్ సంస్థ రూపొందించిన కొత్త వెబ్సైట్లో సాంకేతికత సమస్యల పరిష్కారం కొలిక్కిరాని నేపథ్యంలో సెప్టెంబరు 30 వరకు ఉన్న ఈ గడువును డిసెంబర్ 31 వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
6. ఒక్క డోసుతో.. మరణం నుంచి 96శాతం రక్షణ!
కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఒక్క డోసు తీసుకోవడం ద్వారా కొవిడ్ మరణాన్ని 96.6శాతం నివారించవచ్చని ఉద్ఘాటించింది. అంతేకాకుండా రెండు డోసుల అనంతరం కొవిడ్ మరణాలను నివారించడంలో 97.5శాతం సమర్థత కలిగివున్నట్లు పేర్కొంది. ఇక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ బారినపడినా ప్రమాదం తక్కువేనని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్ 18 నుంచి ఆగస్టు 15 వరకు సేకరించిన సమాచారం ప్రకారం, కరోనా వల్ల కలిగే మరణాలను వ్యాక్సిన్లు నివారిస్తున్నట్లు తేలిందని భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) చీఫ్ బలరాం భార్గవ వెల్లడించారు.
బ్రేక్త్రూ ఇన్ఫెక్షన్లతో పెద్దవారికి ముప్పే..!
7. ‘బిగ్బాస్’ చేసిన సంవత్సరం.. నిందలు ఎదుర్కొవాల్సి వచ్చింది
తెలుగు ప్రేక్షకులకి.. పండగ సినిమాలకీ విడదీయరాని బంధముంది. పండగొచ్చిందంటే చాలు ప్రేక్షకులు కుటుంబ సమేతంగా థియేటర్లో వచ్చి వాలిపోతుంటారు. కొత్త చిత్రాల్ని మనసారా ఆస్వాదించి, ఆశీర్వదించి వెళ్తుంటారు. ఈసారి ఆ పండగ సినీ వినోదాన్ని ‘టక్ జగదీష్’తో నేరుగా సినీప్రియుల ఇంటికే తీసుకొస్తున్నారు కథానాయకుడు నాని. శివ నిర్వాణ తెరకెక్కించిన కుటుంబ కథా చిత్రమిది. . ‘బిగ్బాస్’ చేసిన సంవత్సరమే. ఆ ఏడాది చాలా నిందలు ఎదుర్కొవాల్సి వచ్చింది (నవ్వుతూ). అప్పుడనిపించింది.. ‘అమ్మ చెప్పింది నిజమే.. ఇక నుంచి కచ్చితంగా కథ విని, అక్షింతలు వేసుకోవాల్సిందేన’ని నిర్ణయించుకున్నానని నాని చెప్పారు.
8. టీమిండియా ఫిజియోకు కరోనా.. ప్రాక్టీస్ సెషన్ రద్దు.!
భారత క్రికెట్ జట్టుకు జూనియర్ ఫిజియోగా వ్యవహరిస్తున్న యోగేశ్ పర్మార్ గురువారం కరోనా బారిన పడటంతో.. ప్రాక్టీస్ సెషన్ రద్దు అయ్యింది. బీసీసీఐ అధికారులు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దీంతో భారతజట్టుకు మరో ఫిజియోను అందుబాటులో ఉంచాలని బీసీసీఐ అధికారులు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)ని కోరారు. సహాయ సిబ్బంది, ఆటగాళ్ల నుంచి శాంపిల్స్ సేకరించారు. ఈ రోజు రాత్రికి ఆర్టీ-పీసీఆర్ ఫలితాలు రానున్నాయి. వాటిపైనే చివరి మ్యాచ్ నిర్వహణ ఆధారపడి ఉంటుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అప్పటి వరకు ఆటగాళ్లు తమకు కేటాయించిన గదుల్లోనే ఉండాలని సూచించారు.
9. బైడెన్ సర్కారు కీలక విషయాలు కప్పిపెడుతోందా..?
శ్వేత సౌధం అఫ్గాన్ నుంచి అమెరికన్ల తరలింపు విషయంలో బైడెన్ సర్కారు అనుమానాస్పదంగా ప్రవర్తిస్తోంది. శ్వేత సౌధ ప్రతినిధి జెన్సాకీ నిన్న విలేకర్లతో మాట్లాడుతున్న సమయంలో ఈ విషయం స్పష్టమైంది. అమెరికా మీడియాకు చెందిన కొందరు రిపోర్టర్లు అఫ్గానిస్థాన్లోని అమెరికన్ల పరిస్థితిపై ప్రశ్నించారు. తరలింపు అంశం ఎక్కడ వరకు వచ్చింది..? ఎక్కడ నిలిచిపోయింది..? దీనిపై మీకు తెలిసిన సమాచారం ఏమిటీ..? తాలిబన్లు అడ్డుకొంటున్నారా..? అని ప్రశ్నించారు. దీనికి జెన్సాకీ నేరుగా సమాధానం ఇవ్వలేదు.
10. కన్నీటితో నిండిన కళ్లు.. ఇది ఎలా ఉంటుందో తల్లులందరికీ తెలుసు
ఓ తల్లి తన కుమారుడి పుట్టిన రోజున ఓ గిఫ్ట్ ఇచ్చి అతడ్ని ఆశ్చర్యపరిచిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. ఆ వీడియో కాస్త కంటతడి పెట్టిస్తూ నెటిజన్ల హృదయాలను మెలిపడుతున్నట్లుగా ఉంది. ఈ వీడియోలో దివ్యాంగుడైన కుమారుడికి అతని తల్లి పుట్టిన రోజు కానుకగా ఫోన్ గిఫ్ట్గా ఇచ్చారు. దాన్ని అందుకున్న తర్వాత అతను సంతోషంలో మునిగితేలినట్లుగా కనిపిస్తాడు. గిఫ్ట్ బాక్స్ను తెరిచే ముందు ఓసారి ముద్దాడుతాడు. అందులోని ఫోన్ను చూడగానే ఆశ్చర్యానికి గురవుతాడు. తన తల్లిని దగ్గరికి పిలిచి కృతజ్ఞతలు తెలుపుతాడు. ఆ సమయంలో తన నవ్వును ఆపులేకపోతాడు. చివరిలో కెమెరాకి స్టిల్ ఇచ్చి ఇద్దరు ఫొటో దిగినట్లుగా అనిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!