యాంటీబాడీలు వృద్ధి చెందలేదని పూనావాలాపై కేసు
కరోనా టీకా కొవిషీల్డ్ను తీసుకున్నా తనకు యాంటీబాడీలు వృద్ధి చెందలేదని సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలాపై ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి కేసు వేశారు. ఆ టీకాను అభివృద్ధి చేసిన పూనావాలాతోపాటు డీసీజీఏ డైరెక్టర్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్, ఐసీఎంఆర్ డైరక్టర్ బలరాం భార్గవ, నేషనల్ హెల్త్ మిషన్ డైరక్టర్ అపర్ణ ఉపాధ్యాయపై లఖ్నవూలోని ఆషియానా పోలీసు స్టేషన్లో ప్రతాప్ చంద్ర అనే వ్యక్తి కేసు వేశారు.
ప్లేట్లెట్లు సగానికి తగ్గాయని ఆరోపణ
లఖ్నవూ: కరోనా టీకా కొవిషీల్డ్ను తీసుకున్నా తనకు యాంటీబాడీలు వృద్ధి చెందలేదని సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలాపై ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి కేసు వేశారు. ఆ టీకాను అభివృద్ధి చేసిన పూనావాలాతోపాటు డీసీజీఏ డైరెక్టర్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్, ఐసీఎంఆర్ డైరక్టర్ బలరాం భార్గవ, నేషనల్ హెల్త్ మిషన్ డైరక్టర్ అపర్ణ ఉపాధ్యాయపై లఖ్నవూలోని ఆషియానా పోలీసు స్టేషన్లో ప్రతాప్ చంద్ర అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
‘ఏప్రిల్ 8న కొవిషీల్డ్ మొదటి డోసు తీసుకున్నా. అయితే 28 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవాలని మొదట వెల్లడించారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం దానిని ఆరు వారాలకు పొడిగించింది. మళ్లీ దానిని 12 వారాలకు సవరించింది. అయితే మొదటి డోసు తీసుకున్న తర్వాత నా ఆరోగ్యం క్షీణించింది’ అని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కొవిషీల్డ్ మొదటి డోసు తీసుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయన్న ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ మీడియాతో వెల్లడించిన మాటలను ఉటంకిస్తూ ప్రతాప్ చంద్ర కేసు వేశారు.
ప్రభుత్వం ఆమోదించిన ల్యాబ్లో కొవిడ్ యాంటీబాడీ పరీక్ష చేసుకొని ఆ ప్రతులను ఫిర్యాదుకు ఆధారంగా జత చేశారు. కాగా ప్రతాప్ చంద్రకు యాంటీబాడీలు అభివృద్ధి కాలేదని, బదులుగా అతడి ప్లేట్లెట్లు 3 లక్షల నుంచి 1.5 లక్షలకు తగ్గినట్లు ఆ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. కొవిషీల్డ్ తీసుకున్నాకే తన ప్లేట్లెట్స్ సగానికిపైగా పడిపోయాయని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. పోలీసులు ప్రతాప్ చంద్ర ఫిర్యాదును స్వీకరించారు. కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. కేసు తీవ్రత దృష్ట్యా విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని ఆషియానా పోలీసులు వెల్లడించారు. అయితే కేసు నమోదు చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తానని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
-
తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్లు ఇవ్వనున్న చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
బేబీ ఫుడ్లో చక్కెర.. వివరణ ఇచ్చిన నెస్లే ఇండియా
-
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
-
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!