నిలువు నీడలేని హ్యాట్రిక్ ఎమ్మెల్యే
మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు.. పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని ప్రజల కోసం పనిచేశారు.. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్లారు.. కానీ ప్రస్తుతం ఉండడానికి ఇల్లు కూడా లేక కూతురి ఇంట్లో తలదాచుకుంటున్నారు....
దయనీయ పరిస్థితిలో భద్రాచలం మాజీ శాసనసభ్యుడు
ఇంటర్నెట్ డెస్క్: మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు.. పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని ప్రజల కోసం పనిచేశారు.. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్లారు.. కానీ, ప్రస్తుతం ఉండడానికి ఇల్లు కూడా లేక కుమార్తె ఇంట్లో తలదాచుకుంటున్నారు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిస్తే తరతరాలు కూర్చొని తినేలా డబ్బు పోగేస్తున్న నేటి కాలంలో ఆయనొక అరుదైన నేత. ఆయనే భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి.
కుంజా బొజ్జిది ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా వరరామచంద్రాపురం మండలం అడవి వెంకన్న గూడెం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన ఆయన చిన్నప్పుడే సీపీఎం సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరఫున పలు పోరాటాలు చేసి ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజా బొజ్జి కాలినడకనే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ప్రజల్లో మంచి పేరు గడించిన ఆయన భద్రాచలం నుంచి 1985-1999 వరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఉన్నా సైకిల్ పైనే కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు.
కుంజా బొజ్జి, లాలమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. భార్యతో కలిసి పూరి గుడిసెలో జీవించేవారు. గతేడాది భార్య అనారోగ్యంతో మృతిచెందడంతో ఈయన ఒంటరయ్యారు. 95 ఏళ్ల వయస్సులో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన భద్రాచలంలో ఉంటున్న కుమార్తె వద్ద కాలంవెళ్లదీస్తున్నారు. కుంజా బొజ్జి పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం చేశాయి. ఈ మాజీ ఎమ్మెల్యేకు ప్రభుత్వం అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ