AndhraPradesh : ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి అనుమతి లేదు: సీపీ కాంతిరాణా
పీఆర్సీకి వ్యతిరేకంగా గురువారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి
అమరావతి: పీఆర్సీకి వ్యతిరేకంగా గురువారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి అనుమతి లేదని విజయవాడ సీపీ కాంతిరాణా తెలిపారు. కొవిడ్ దృష్ట్యా ఉద్యోగ సంఘాలకు అనుమతి ఇవ్వలేదన్నారు. 200 మందితోనే బహిరంగ కార్యక్రమాలకు అనుమతి ఉందని పేర్కొన్నారు. ఐదు వేలమంది వస్తామని ఉద్యోగులు దరఖాస్తులో పేర్కొన్నారని చెప్పారు. అంతమంది సభకు వస్తే నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందని వెల్లడించారు. దయ చేసి విజయవాడ కార్యక్రమానికి ఉద్యోగులు ఎవరూ రావొద్దని సీపీ కాంతిరాణా సూచించారు.
మరోవైపు ఉద్యోగులు ఆందోళనలను విరమించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ విజ్ఞప్తి చేశారు. ఇవాళ రాత్రి 11 లోగా కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు వేస్తామని చెప్పారు. అభ్యంతరాలను చర్చలతో పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. ‘చలో విజయవాడ’, సమ్మె కార్యాచరణ విరమించుకోవాలని సూచించారు. సమ్మెకు వెళ్లడం అంటే కష్టాలు కొని తెచ్చుకోవడమేనని పేర్కొన్నారు. ప్రభుత్వం చర్చలకు మరోసారి సిద్ధమని తెలియజేస్తున్నామని వెల్లడించారు. ఉద్యోగుల సమ్మెను అసాంఘిక శక్తులు కైవసం చేసుకునే అవకాశం ఉందని వివరించారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేశారు. అయితే మంత్రుల కమిటీతో జరుగుతున్న చర్చలు విఫమైనట్లేనని పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాస్, సూర్యనారాయణ అన్నారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 30 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్