మొదటి రోజు 82 రిజిస్ట్రేషన్లు: సీఎస్‌

మూడు నెలల అనంతరం పూర్వపు కార్డ్‌ విధానంలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 40 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 82 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. మంగళవారానికి 58 కార్యాలయాల్లో

Published : 14 Dec 2020 23:55 IST

హైదరాబాద్‌: మూడు నెలల అనంతరం పూర్వపు కార్డ్‌ విధానంలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 40 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 82 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. మంగళవారానికి 58 కార్యాలయాల్లో 155 స్లాట్లు బుక్‌ అయ్యాయని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. స్లాట్ల విధానంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సాఫీగా సాగుతోందని సీఎస్‌ పేర్కొన్నారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్‌ కోసం ముందస్తుగా స్లాట్ల బుకింగ్‌ తప్పనిసరని,  స్లాట్‌లు బుక్‌ చేయకుండానే కొందరు రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్తున్నారని సీఎస్‌ తెలిపారు. ఎక్కడి నుంచైనా స్లాట్లు బుక్‌ చేసుకునేందుకు వెసులుబాటు ఉందని ఆయన పేర్కొన్నారు. 

ఇదీ చదవండి..
యాజమాన్య హక్కుల కోసం ఎదురుచూపులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని