
Mango: ఒక్కో మామిడి పండు రూ.1,000
అలీరాజాపూర్(మధ్యప్రదేశ్): పండ్లలో రారాజుగా పిలిచే మామిడి.. ధర పలికితే రైతునూ రాజును చేయగలదు. బంగినపల్లి, నీలం, తోతాపురి ఇలా అనేక రకాల్లో లభించే ఈ పండుకు సీజన్లో ఉండే క్రేజే వేరు. అయితే, వీటన్నింటిలో కెల్లా మధ్యప్రదేశ్లోని అలీరాజాపూర్ జిల్లాలో లభించే ‘నూర్జహాన్’ వెరైటీకి ఉన్న ప్రత్యేకత అంతాఇంతా కాదు. పూత దశలో ఉండగానే.. అనేక మంది వీటిని బుక్ చేసుకుంటుంటారు. అంతటి క్రేజ్ దీని సొంతం.
ఈసారి వాతావరణం అనుకూలించడంలో దిగుబడి బాగా వచ్చిందని నూర్జహాన్ను పండించే రైతులు చెబుతున్నారు. ఒక్కో కాయ మూడు కిలోల వరకు తూగుతున్నట్లు తెలిపారు. గత ఏడాది ప్రతికూల పరిస్థితుల వల్ల ఒక్కో పండు బరువు 2.5 కిలోల వరకే పరిమితమైనట్లు రైతులు తెలిపారు. పైగా కరోనా ప్రభావంతో 2020 వేసవిలో పెద్దగా డబ్బులేమీ రాలేదని వాపోయారు. కానీ, ఈసారి మాత్రం మార్కెట్లో నూర్జహాన్ పండుకు మంచి డిమాండ్ ఉన్నట్లు రైతులు తెలిపారు. ఒక్కో పండును రూ.1000 వరకు ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. 2019లో దీని ధర రూ.1,200 వరకు పలకడం గమనార్హం.
జనవరి, ఫిబ్రవరిలో ఈ చెట్లు పూతకు పూస్తాయి. జూన్ ప్రారంభంలో పండ్లు చేతికొస్తాయి. ఈ మామిడి కాయలు ఒక్కొక్కటి అడుగు మేర పొడువు ఉంటాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.