TajMahal: ఇకపై ఉదయం 6 గంటలకే..!
సుప్రభాత వేళ తాజ్ మహల్ అందాలను చూడాలనుకునేవారికి ఆగ్రా పర్యాటక సంక్షేమ శాఖ తీపి కబురు చెప్పింది. ఇకపై తాజ్ను సందర్శించేందుకు ఉదయం 6 గంటల
ఆగ్రా: సుప్రభాత వేళ తాజ్ మహల్ అందాలను చూడాలనుకునేవారికి ఆగ్రా పర్యాటక సంక్షేమ శాఖ తీపి కబురు చెప్పింది. ఇకపై తాజ్ను సందర్శించేందుకు ఉదయం 6 గంటల నుంచే అనుమతించనుంది. ఈ మేరకు ఆగ్రా పర్యాటక సంక్షేమ శాఖ ఛాంబర్ అధ్యక్షుడు ప్రహ్లాద్ అగర్వాల్ వెల్లడించారు. ఇప్పటిదాకా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తాజ్ను దర్శించేందుకు అనుమతిస్తున్నామని తెలిపారు. దీంతో బంగారు వర్ణంలో మెరిసే తాజ్ సోయగాన్ని వీక్షించే అవకాశాన్ని పర్యాటకులు కోల్పోతున్నారని పేర్కొన్నారు. సూర్యోదయం, సూర్యాస్తమయం వేళల్లో తాజ్ అందాలను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది సందర్శకులు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కొవిడ్ ఉద్ధృతి కారణంగా ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో తాజ్ సందర్శన సమయాల్లో మార్పులు చేయలేకపోయామని ప్రహ్లాద్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం ఆంక్షలను కొంతమేర సడలించడంతో భానుడి తొలి కిరణాలు తాకుతున్న తాజ్ అందాలను చూసే అవకాశం పర్యాటకులకు కలగనుందని వివరించారు. ఆగ్రాలోని ఇతర చారిత్రక కట్టడాలను కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శించే వీలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 6 గంటలకు తాజ్మహల్ను సందర్శించాలంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఒక రోజు ముందుగానే ఆగ్రాకు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో రెండేళ్లుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న పర్యాటక రంగానికి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
నగర శివారులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు