Karnataka: భార్య అతి శుభ్రత.. విడాకులు కోరిన భర్త!

భార్య చేసే అతి శుభ్రతను తట్టుకోలేని ఓ భర్త.. విడాకులు కోరిన ఘటన కర్ణాటకలో జరిగింది. రోజుకు ఆరుసార్లు స్నానం చేయడమే కాకుండా

Published : 05 Dec 2021 02:00 IST

బెంగళూరు: భార్య చేసే అతి శుభ్రతను తట్టుకోలేని ఓ భర్త.. విడాకులు కోరిన ఘటన కర్ణాటకలో జరిగింది. రోజుకు ఆరుసార్లు స్నానం చేయడమే కాకుండా శుభ్రంగా ఉండాలంటూ తనను కూడా అనుక్షణం ఒత్తిడి చేస్తోందని పోలీసులకు భర్త ఫిర్యాదు చేశారు. తన భార్యకు ఆబ్‌సెస్సివ్ కంపల్సివ్ డిజార్డర్(ఓసీడీ) వ్యాధి ఉందని భర్త వివరించారు. బెంగళూరులోని ఆర్‌టీనగర్‌కు చెందిన ఈ జంటకు 2009లో వివాహం జరిగింది. అనంతరం ఉద్యోగ నిమిత్తం వారు లండన్‌కు వెళ్లారు. తొలి సంతానం కలిగిన తర్వాత తన భార్యకు అతి శుభ్రత వ్యాధి మరింత ఎక్కువైందని భర్త తెలిపారు. విధుల నుంచి ఇంటికి రాగానే బూట్లు, దుస్తులు, సెల్‌ఫోన్‌ శుభ్రం చేయాలని చెప్పేదని ఆయన వివరించారు. కొద్ది రోజుల క్రితం భారత్‌కు తిరిగి వచ్చి కౌన్సిలింగ్‌ ఇప్పించినా.. రెండో సంతానం కలిగిన తర్వాత కూడా ఆమె అదే విధంగా చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఆమెకు ఈ వ్యాధి మరింత ఎక్కువైందని చెప్పారు. సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ తదితర వస్తువులను సబ్బుతో శుభ్రం చేస్తోందని వాపోయారు. దీంతో విసుగుచెందిన ఆ భర్త పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. బెంగళూరులో మహిళల సహాయం కోసం ఏర్పాటు చేసిన ‘వనిత సహాయ వాణి’కి కేసును అప్పగించారు. 

Read latest General News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని