Karnataka: పట్టుకున్న పాము కాటు వేయడంతో.. వృద్ధుడు మృతి

పట్టుకున్న పాము కాటు వేయడంతో వృద్ధుడు మృతిచెందిన ఘటన కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది.

Published : 28 Nov 2021 12:50 IST

వాడ్గెరా: పాము కాటు వేయడంతో వృద్ధుడు మృతిచెందిన ఘటన కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది. వాడ్గెరా తాలుకా గోడిహలా గ్రామానికి చెందిన వృద్ధుడు బసవరాజు పూజారి గ్రామంలోకి వచ్చిన పాములను పట్టుకునే అలవాటుంది. అలా పట్టుకున్న పాములను గ్రామం నుంచి బయటకు తీసుకెళ్లి వదలిపెడుతుంటాడు. ఈ క్రమంలో శనివారం అతని ఇంటిలోకి ప్రవేశించిన పామును బసవరాజు పట్టుకొన్నాడు. దానిని గ్రామం బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడిని ఆ సర్పం ఐదు సార్లు కాటు వేసింది. విషం శరీరమంతటా వ్యాపించడంతో.. చేతిలో పామును పట్టుకొని ఉండగానే అతడు ప్రాణాలు విడిచాడు. 

Read latest General News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని