OMC Case: వేగవంతమైన ఓఎంసీ కేసు విచారణ.. నిందితుల డిశ్ఛార్జ్ పిటిషన్ల కొట్టివేత
సుప్రీంకోర్టు జోక్యంతో ఓబుళాపురం మైనింగ్ కేసు(ఓఎంసీ) కేసు విచారణ ప్రక్రియ వేగవంతమైంది. ఈ కేసులో నిందితుల డిశ్ఛార్జ్ పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టేసింది. నిందితుల డిశ్ఛార్జ్ పిటిషన్లను కొట్టివేస్తూ అభియోగాల నమోదుపై తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది.
హైదరాబాద్: సుప్రీంకోర్టు జోక్యంతో ఓబుళాపురం మైనింగ్ కేసు(ఓఎంసీ) విచారణ ప్రక్రియ వేగవంతమైంది. ఈ కేసులో నిందితుల డిశ్ఛార్జ్ పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టేసింది. ఓఎంసీ కేసు నుంచి తొలగించాలన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు.. ఆమె దాఖలు చేసిన డిశ్ఛార్జ్ పిటిషన్ను కొట్టేసింది. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, విశ్రాంత అధికారులు కృపానందం, వి.డి.రాజగోపాల్, గాలి జనార్దన్ రెడ్డి పీఏ అలీఖాన్ దాఖలు చేసిన డిశ్ఛార్జ్ పిటిషన్లనూ సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన గాలి జనార్దన్, బి.వి.శ్రీనివాస్రెడ్డి డిశ్ఛార్జ్ పిటిషన్లను గతంలోనే ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.
అనంతపురం జిల్లా డి.హీరేహాళ్, ఓబుళాపురం మండలాల్లో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమ మైనింగ్కు పాల్పడిన కేసులోని నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై ఇటీవల హైదరాబాద్ సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. ఓఎంసీ కేసులో అన్నీ చట్ట ప్రకారమే జరిగాయని, సీబీఐవి ఊహాజనిత ఆరోపణలేనని, చట్ట ప్రకారం లీజులు మంజూరు చేశారని నిందితుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ వాదనలతో సీబీఐ న్యాయవాది విభేదిస్తూ గాలి జనార్దన్రెడ్డికి నిందితులందరూ సహకారం అందించారన్నారు. ఏపీ, కర్ణాటకల సరిహద్దులను చెరిపేసి గాలి జనార్దన్రెడ్డి కంపెనీ అక్రమ తవ్వకాలు చేసిందని, ఏపీ లైసెన్సుల ఆధారంగా అక్రమ రవాణా జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసు ప్రాథమిక దశలోనే ఉన్నందువల్ల నిందితుల డిశ్ఛార్జ్ పిటిషన్లను కొట్టేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి నిందితులు తమ అభ్యంతరాలను రాతపూర్వకంగా సమర్పించవచ్చని పేర్కొంటూ డిశ్ఛార్జ్ పిటిషన్లపై ఉత్తర్వులను అక్టోబరు 17న వెల్లడిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ చేపట్టిన సీబీఐ న్యాయస్థానం నిందితుల డిశ్ఛార్జ్ పిటిషన్లను కొట్టివేస్తూ అభియోగాల నమోదుపై తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ