TS News: సీఎం కేసీఆర్ మంచి గైడెన్స్ ఇచ్చారు: సీఎస్
దేశవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వ్యాక్సిన్ల పంపిణీ పూర్తయిన సందర్భంగా వైద్య సిబ్బంది సంబురాలు నిర్వహించారు. కోఠిలోని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన......
తెలంగాణలో ఘనంగా శతకోటి టీకా సంబురం
హైదరాబాద్: దేశవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వ్యాక్సిన్ల పంపిణీ పూర్తయిన సందర్భంగా వైద్య సిబ్బంది సంబురాలు నిర్వహించారు. కోఠిలోని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకల్లో వైద్య సిబ్బందికి సీఎస్ సోమేశ్ కుమార్, రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి అభినందనలు తెలిపారు. తెలంగాణలో 3 కోట్ల కరోనా టీకాల పంపిణీ పూర్తికావడంలో ఆరోగ్య సిబ్బంది కృషిని ప్రశంసించారు. ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలి కోటి డోసుల టీకా పంపిణీకి 165 రోజుల సమయం పట్టిందన్నారు. అయితే, రెండో కోటి డోసులకు 81 రోజుల సమయం పడితే.. మూడో కోటి డోసుల పంపిణీని మాత్రం కేవలం 36 రోజుల్లోనే పూర్తిచేశామని వివరించారు.
వ్యాక్సిన్ విషయంలో సీఎం కేసీఆర్ మంచి మార్గదర్శకాలు ఇచ్చారన్నారు. జాతీయ సగటుతో పోలిస్తే వ్యాక్సినేషన్లో తెలంగాణ ముందుందని చెప్పారు. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో 27 వేల పడకలకు ఆక్సిజన్ సదుపాయం ఉందన్నారు. ప్రభుత్వం, వైద్యశాఖ సంయుక్త కృషితో ఈ మైలురాయి చేరుకున్నామన్నట్టు ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ అన్నారు. జీహెచ్ఎంసీలో ప్రత్యేక డ్రైవ్ల ద్వారా వ్యాక్సినేషన్ను వేగవంతం చేశామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో