యోయో టెస్టు గురించి కోహ్లీని అడిగిన మోదీ
భారతీయులంతా ఫిట్గా ఉండి ధృఢ భారతదేశం ఏర్పాటు లక్ష్యంగా గతేడాది ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ధృఢ భారత్ ఉద్యమం గురువారంతో
దృఢ భారత్ ఉద్యమానికి ఏడాది
న్యూదిల్లీ: భారతీయులంతా ఫిట్గా ఉండి దృఢ భారతదేశం ఏర్పాటు లక్ష్యంగా గతేడాది ప్రధాని మోదీ పిలుపునిచ్చిన దృఢ భారత్ ఉద్యమం గురువారంతో ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలువురు ప్రముఖులు, క్రీడాకారులు, ఫిటెనెస్కు ప్రాధాన్యం ఇస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న వారితో ఫిట్ ఇండియా నినాదం 2020 పేరుతో వర్చువల్ వేదికగా మాట్లాడారు. ఆయన ఆహారపు అలవాట్లను పంచుకున్నారు. పోషకాహారం నిపుణులు రిజుతా దివాకర్తో మాట్లాడే సమయంలో ప్రధాని మోదీ పసుపును ఆహారంలో భాగంగా తీసుకుంటానని వివరించారు. తన మాతృమూర్తితో వారానికి రెండుసార్లు మాట్లాడటానికి ప్రయత్నిస్తానని చెప్పిన మోదీ.. తన తల్లి ప్రతిసారీ ఆహారంలో పసుపు వాడుతున్నావా లేదా అని అడుగుతారని వివరించారు.
యోయో టెస్టు గురించి కోహ్లీని అడిగిన మోదీ..
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో కూడా ప్రధాని మోదీ ముచ్చటించారు. క్రికెట్ ఆటగాళ్ల ఫిట్నెస్కు సంబంధించి యోయో టెస్టు గురించి చెప్పమని విరాట్ను అడిగారు. దీనికి నవ్వుతూ సమాధానం చెప్పిన కోహ్లి యోయో టెస్టు ఆటగాళ్లలోని అత్యుత్తమ ఫిట్నెస్ను పరీక్షిస్తుందని తెలిపారు. టెస్టు గురించి వివరిస్తూ.. ఆటగాడు 20 మీటర్ల దూరం మధ్యలో ఉంచిన లక్ష్యాలను బీప్ శబ్దాలను ఆధారంగా ఛేదించాలని తెలిపారు. తన దినచర్యలో వ్యాయామం భాగమైందని చెప్పిన కోహ్లీ ప్రతి ఒక్కరిలో ఫిట్నెస్ సంస్కృతి అలవడాలని పేర్కొన్నారు. తరాలుగా వచ్చే సంప్రదాయ ఆహారం తీసుకొని మన ప్రాచీనులు ఆరోగ్యవంతంగా ఉన్నారని కోహ్లీ అన్నారు. ప్రస్తుతం అటువంటి ఆహారం తినటం మానేసి బయటి తిండికి అలవాటు పడటంతో ఫిట్నెస్ స్థాయులు దారుణంగా పడిపోయాయని వివరించారు.
మానసిక దృఢత్వం అవసరం
ప్రజలు ఫిట్గా ఉండే దేశం ఏ సమస్యనైనా ఎదుర్కోగలదని మోదీ వివరించారు. శరీరం దృఢత్వంతో పాటు మానసికంగా దృఢంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వయసుల వారీగా ఎటువంటి ఫిట్నెస్ లక్ష్యాలను నిర్దేశించుకోవాలో ప్రధాని మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఫిట్నెస్కు ప్రాధాన్యం సంతరించుకున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట