Anand Mahindra: ఇలాంటివి భారత్‌లోనే సాధ్యమంటోన్న ఆనంద్‌ మహీంద్రా

ఆనంద్‌ మహీంద్రా పంచుకున్న ఓ వీడియో వైరల్‌గా మారింది. చిన్నచిన్న లైట్లు, ఇతర అలంకరణ వస్తువులతో అందంగా ముస్తాబు చేసిన స్కూటర్‌........

Published : 19 Jun 2022 01:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సామాజిక మాధ్యమాల్లో నిత్యం చురుగ్గా ఉంటూ ఎన్నో కొత్త విషయాలను పంచుకుంటుంటారు ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా. సరికొత్తగా అనిపించే ఫొటోలు, వీడియోలను ట్విటర్‌లో పోస్టు చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన పంచుకున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. చిన్నచిన్న లైట్లు, ఇతర అలంకరణ వస్తువులతో అందంగా ముస్తాబు చేసిన స్కూటర్‌కు సంబంధించిన క్లిప్పింగ్‌ను మహీంద్రా తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు.

టైర్లు మినహాయిస్తే.. ఆ స్కూటర్‌ మొత్తాన్ని అలంకరణ వస్తువులతో చూడముచ్చటగా తయారు చేశారు. హ్యాండిళ్ల మధ్య డూంలో ఓ సెల్‌ఫోన్‌ను సైతం అమర్చారు. ఓ పెట్రోల్‌ బంకు వద్ద పార్కు చేసి ఉన్న ఈ స్కూటర్‌ వద్ద పలువురు సెల్ఫీలు కూడా తీసుకోవడం ఆ వీడియోలో కనిపిస్తుంది. కాగా ఆ వీడియోను మహీంద్రా షేర్‌ చేస్తూ.. ‘జీవితం రంగులమయంగా, వినోదాత్మకంగా ఉండాలని మీరు కోరుకుంటే అలాగే ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఇలాంటి వినూత్న ఐడియాలు భారత్‌లోనే సాధ్యం అని అన్నారు. కాగా ఆ పోస్టును ఇప్పటికే 3.3లక్షల మంది వీక్షించారు. 16వేల మంది లైక్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని