Anand Mahindra: ఇలాంటివి భారత్లోనే సాధ్యమంటోన్న ఆనంద్ మహీంద్రా
ఆనంద్ మహీంద్రా పంచుకున్న ఓ వీడియో వైరల్గా మారింది. చిన్నచిన్న లైట్లు, ఇతర అలంకరణ వస్తువులతో అందంగా ముస్తాబు చేసిన స్కూటర్........
ఇంటర్నెట్ డెస్క్: సామాజిక మాధ్యమాల్లో నిత్యం చురుగ్గా ఉంటూ ఎన్నో కొత్త విషయాలను పంచుకుంటుంటారు ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా. సరికొత్తగా అనిపించే ఫొటోలు, వీడియోలను ట్విటర్లో పోస్టు చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన పంచుకున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. చిన్నచిన్న లైట్లు, ఇతర అలంకరణ వస్తువులతో అందంగా ముస్తాబు చేసిన స్కూటర్కు సంబంధించిన క్లిప్పింగ్ను మహీంద్రా తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు.
టైర్లు మినహాయిస్తే.. ఆ స్కూటర్ మొత్తాన్ని అలంకరణ వస్తువులతో చూడముచ్చటగా తయారు చేశారు. హ్యాండిళ్ల మధ్య డూంలో ఓ సెల్ఫోన్ను సైతం అమర్చారు. ఓ పెట్రోల్ బంకు వద్ద పార్కు చేసి ఉన్న ఈ స్కూటర్ వద్ద పలువురు సెల్ఫీలు కూడా తీసుకోవడం ఆ వీడియోలో కనిపిస్తుంది. కాగా ఆ వీడియోను మహీంద్రా షేర్ చేస్తూ.. ‘జీవితం రంగులమయంగా, వినోదాత్మకంగా ఉండాలని మీరు కోరుకుంటే అలాగే ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఇలాంటి వినూత్న ఐడియాలు భారత్లోనే సాధ్యం అని అన్నారు. కాగా ఆ పోస్టును ఇప్పటికే 3.3లక్షల మంది వీక్షించారు. 16వేల మంది లైక్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!