Asteroid Bennu: 2300 సంవత్సరంలో భూమిని తాకనుంది: నాసా
అంతరిక్ష పరిశోధనల్లో అపార అనుభవం కలిగిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. భూమిని
ఇంటర్నెట్ డెస్క్: అంతరిక్ష పరిశోధనల్లో అపార అనుభవం కలిగిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. భూమిని ఢీకొట్టేందుకు ఓ గ్రహశకలం వస్తోందంటూ చేసిన వ్యాఖ్యలు కొన్నేళ్ల కిందట సంచలనంగా మారాయి. కాగా 2200లో భూమిని బెన్ను అనే గ్రహశకలం ఢీకొట్టే అవకాశం ఉందని నాసా ప్రకటించింది. ఈ క్రమంలో బెన్ను గ్రహశకల కదలికలను అంచనా వేసేందుకు నాసా ప్రయోగించిన ఒసైరిస్ -రెక్స్ వ్యోమనౌక కీలక విషయాలను బయటపెట్టింది.
బెన్ను గ్రహశకలంపై పరిశోధన ప్రారంభించిన నాసా మొదటిలో 2182 సెప్టెంబర్ 24న ఢీకొడుతుందని అంచనా వేస్తూ ఆరోజును భయంకరమైన రోజుగా అభివర్ణించింది. తాజాగా ఒసైరిస్ -రెక్స్ వ్యోమనౌక బెన్ను గ్రహశకలం తిరుగుతున్న కక్ష్యను అంచనా వేయడం ద్వారా అది 2300 సంవత్సరంలో భూమిని తాకే అవకాశం ఉందని నాసా నిర్ణయానికి వచ్చింది. 2135 సవంత్సరంలో బెన్ను గ్రహశకలం భూమికి, చంద్రుడికి మధ్యగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. ఒసైరిస్ -రెక్స్ వ్యోమనౌక ఇచ్చిన సమాచారం అధారంగా ఈ అంచనాకు వచ్చినట్టు నాసా పేర్కొంది.
2016 నుంచి నాసా బెన్ను గ్రహశకలంపై అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంలో నాసా ఆ ఏడాదిలో ఒసైరిస్ -రెక్స్ వ్యోమనౌకను ప్రయోగించింది. ఇది నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 2020 అక్టోబర్ 21న విజయవంతంగా బెన్ను గ్రహశకలంపై దిగింది. అప్పటి నుంచి గ్రహశకలంపై ఉన్న నమూనాలను సేకరిస్తూ గ్రహ కదలికల్ని అంచనా వేస్తోంది. బెన్ను గ్రహశకలం భూమికి సుమారు 29.3 కోట్ల కి.మీ. దూరంలో ఉందని, ఇది భూమికి అంగారకుడికి మధ్య ఉన్న దూరంతో సమానమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది ఆరేళ్లకు ఒక సారి భూమికి దగ్గరగా వస్తున్నట్లు పేర్కొన్నారు. ఒసైరిస్ -రెక్స్ వ్యోమనౌక నుంచి సేకరించిన నమూనాలు 2023లో భూమికి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు ఇదివరకే ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..