సర్కారు బడుల్లో విద్యార్థులు 20 శాతమే
‘కుమురం భీమ్, ములుగు, మెదక్ జిల్లాల్లో సుమారు 73 శాతం విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో
సామాజిక, ఆర్థిక సర్వే-2021లో వెల్లడి
హైదరాబాద్: ‘కుమురం భీమ్, ములుగు, మెదక్ జిల్లాల్లో సుమారు 73 శాతం విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చదువుతుంటే.. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో అలాంటి పిల్లల శాతం 25 కంటే తక్కువే. బాలికల విద్యకు మాత్రం సర్కారు బడులే వేదికలుగా ఉన్నాయి. ముఖ్యంగా 11-16 సంవత్సరాల పిల్లల్లో బాలుర కంటే బాలికలే ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా చదువుతున్నారు’ అని రాష్ట్ర సామాజిక, ఆర్థిక సర్వే-2021 వెల్లడించింది. ఆ సర్వే నివేదికను ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దాని ప్రకారం.. మొత్తం 33 జిల్లాల్లో ఆరింటిలో మాత్రం సగం కంటే తక్కువ మంది సర్కారు బడుల్లో చదువుతున్నారు. మిగిలిన 27 జిల్లాల్లో ప్రభుత్వ బడుల్లోనే ఎక్కువ మంది ఉన్నారు. నిజామాబాద్-47.60 శాతం, పెద్దపల్లి-46.80, కరీంనగర్-35.50, వరంగల్ అర్బన్-29.20, రంగారెడ్డి-26.20, హైదరాబాద్ 20.10, మేడ్చల్ జిల్లాలో 14.60 శాతం మంది విద్యార్థులే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. మొత్తంగా 54 శాతం విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లోనే ఉండటం గమనార్హం. మొత్తం 60.10 లక్షల మంది విద్యార్థులకు 28 లక్షల మందే సర్కారు బడుల్లో ఉన్నారు.
* ప్రస్తుతం రాష్ట్రంలో పాఠశాలల పరిస్థితి ఒక ఉపాధ్యాయుడు, అయిదు తరగతులుగా ఉంది. తద్భిన్నంగా దగ్గరలోని రెండు మూడు చిన్న పాఠశాలలను విలీనం చేసి, రవాణా సౌకర్యం కల్పిస్తే ఉపాధ్యాయుల సంఖ్య పెరిగి నాణ్యమైన విద్య అందుతుందని సర్వే సూచించింది.
* రాష్ట్రంలో 26,065 ప్రభుత్వ పాఠశాలలుండగా అందులో 38 శాతం బడుల్లో.. అంటే 7819 చోట్ల 30 మంది లోపు విద్యార్థులున్నారు. కుమురం భీమ్ జిల్లాలో 54.40 శాతం, ములుగు 52.30, మహబూబాబాద్- 51.30, ఆదిలాబాద్- 50.20, జయశంకర్ భూపాలపల్లిలో 50.10 శాతం బడుల్లో 30 మంది లోపు పిల్లలే ఉన్నారు.
* ప్రతి వెయ్యి జనాభాకు అత్యధికంగా కుమురం భీమ్ జిల్లాలో 2.22 పాఠశాలలుండగా.. అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 0.22 బడులే నడుస్తున్నాయి. అంటే ఈ జిల్లాలో దాదాపు 5వేల మందికి ఒక పాఠశాల ఉంది.
మూడో వంతు బక్కచిక్కిన బాల్యమే అయిదేళ్లలోపు వారిలో 32 శాతం బరువు తక్కువ పిల్లలే
|
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్