ఇమ్యూని‘టీ’
కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో చాలామందిలో ఇమ్యూనిటీపై ఆలోచన మొదలైంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు వ్యాయామం చేయడంతోపాటు ఆహారపు అలవాట్లలో ఎన్నో మార్పులు చేసుకుంటున్నారు. తాజా పండ్ల నుంచి డ్రై ఫ్రూట్స్ వరకు ఎందులో మంచి పోషక విలువలున్నాయో అన్వేషణ ప్రారంభించారు.
మసాలా టీ ఉపయోగాన్ని వివరించిన న్యూట్రిషనిస్టు ల్యూక్ కౌటినో
ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో చాలామందిలో ఇమ్యూనిటీపై ఆలోచన మొదలైంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు వ్యాయామం చేయడంతోపాటు ఆహారపు అలవాట్లలో ఎన్నో మార్పులు చేసుకుంటున్నారు. తాజా పండ్ల నుంచి డ్రై ఫ్రూట్స్ వరకు ఎందులో మంచి పోషక విలువలున్నాయో అన్వేషణ ప్రారంభించారు. అయితే మనం నిత్యం సేవించే మసాలా టీలో ఇమ్యూనిటీ పెంచే గుణం ఉందని ఎవరికైనా తెలుసా? అవును, మసాలా టీ తాగి ఇమ్యూనిటీని పెంచుకోవచ్చని చెబుతున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్టు ల్యూక్ కౌటినో. ప్రపంచవ్యాప్తంగా చాయ్కి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలామందికి పొద్దున్నే నిద్ర లేవగానే ఓ కప్పు చాయ్ తాగనిదే ఆ రోజు ప్రారంభం కాదు. లెమన్ టీ, గ్రీన్ టీ, అల్లం టీ, బ్లాక్ టీ.. ఇలా ఎన్ని రకాలున్నా మసాలా టీ అభిమానుల సంఖ్యే ఎక్కువ. అలాంటి మసాలా టీలో ఉండే ఆరోగ్యపరమైన లాభాలను వివరిస్తూ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ల్యూక్ కౌటినో పోస్టు చేశారు. ‘‘మీలో ఎంతమంది ఇండియన్ మసాలా టీ తాగుతున్నారు.. ఇది ఇమ్యూనిటీని పెంచే చాయ్’’ అని తన పోస్టులో రాశారు. చాయ్ తయారీలో ఉపయోగించే టీ పొడి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, నల్ల మిరియాలు, అల్లం లాంటి మసాలా దినుసులకు శరీరంలో ఇమ్యూనిటీని పెంచే సామర్థ్యం ఉందని వివరించడమే కాకుండా.. మసాలా టీ తయారీ విధానాన్ని కూడా ఆయన పోస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?