ఆప్తులు లేకుండానే తుది మజిలీ..
కరోనా సోకి మృతిచెందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా.. వారి అంత్యక్రియలకు బంధువులు ముందుకురాని పరిస్థితులు తలెత్తుతున్నాయి. వైరస్ సృష్టిస్తున్న విలయంతో మానవ సంబంధాలు బీటలువారుతున్నాయి....
ముఖం చాటేస్తున్న బంధువులు
ఇంటర్నెట్ డెస్క్: కరోనా సోకి మృతిచెందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా.. వారి అంత్యక్రియలకు బంధువులు ముందుకురాని పరిస్థితులు తలెత్తుతున్నాయి. వైరస్ సృష్టిస్తున్న విలయంతో మానవ సంబంధాలు బీటలువారుతున్నాయి. బయటి వ్యక్తులే దహన సంస్కారాలు నిర్వహించి మృతులను సాగనంపుతున్నారు. కొన్ని కుటుంబాల్లో వరుస మరణాలు తీవ్ర విషాధాన్ని నింపుతున్నాయి.
అడ్డుకున్న గ్రామస్థులు
కృష్ణా జిల్లా బాపులబాడు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొవిడ్ బారినపడి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా అతడి మృతదేహాన్ని ఊర్లోకి తీసుకురాకుండా గ్రామస్థులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్థులతో చర్చించి అంత్యక్రియలు జరిగేలా ఒప్పించారు. ఎ.కొండూరు మండలం మాధవరం గ్రామంలో కరోనాతో మృతిచెందిన 70 ఏళ్ల వృద్ధుడికి పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి దహనసంస్కారాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాక దిక్కు తోచని స్థితితో ఉన్న కుమారుడికి పోలీసులే అండగా నిలిచారు.
ముందుకొస్తున్న యువకులు
అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో కొవిడ్ బారినపడి మృతిచెందినవారి దహనసంస్కారాలు నిర్వహించేందుకు సొంతవాళ్లు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో కొందరు యువకులు ఆ బాధ్యతను వారి భుజాలపై వేసుకున్నారు. మృతిచెందిన వారి కుటుంబసభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కుటాగుళ్లకు చెందిన ఓ వ్యక్తి, తనకల్లు మండలం బొంతలపల్లికి చెందిన మరో వ్యక్తి మహమ్మారి బారిన పడి ప్రాణాలు విడవగా అంత్యక్రియల నిర్వహణకు బంధువులు, గ్రామస్థులు ముందుకురాలేదు. యువకులు రంగంలోకి దిగి ఆ పని పూర్తిచేశారు.
స్వచ్ఛందసంస్థల ఉదారత
కడప జిల్లా కమలాపురంలో బాలాజీ అనే విశ్రాంత రైల్వే ఉద్యోగి మృతిచెందగా బంధువులు ముందుకురాలేదు. దీంతో అతడి భార్య, కుమారుడు స్థానికంగా ఉన్న చారిటబుల్ ట్రస్టు వారితో కలిసి దహనసంస్కారాలు నిర్వహించారు. అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద ఉన్న చలివేంద్రంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. కరోనాతో మరణించి ఉంటాడనే అనుమానంతో ఎవరూ దగ్గరకు వెళ్లలేదు. పోలీసులు, స్వచ్ఛందసంస్థల నిర్వాహకులు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయినవారి అంత్యక్రియలకు చాలా మంది వెనకడుగు వేస్తున్న తరుణంలో మాతృదినోత్సవం రోజునే అమ్మ రుణం తీర్చుకుంది ఓ కూతురు. తెనాలిలోని ఐతా నగర్కు చెందిన ఓ మహిళ కొవిడ్తో మృతిచెందగా ఆమె అంత్యక్రియలను కన్న కూతురే నిర్వహించింది.
ఒకే కుటుంబంలో ముగ్గురు.. విషమంగా మరొకరు
సంతోషంగా సాగిపోతున్న కుటుంబాల్లో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరులోని ఓ కుటుంబంలో నలుగురు కొవిడ్ బారినపడగా వారిలో కుటుంబ పెద్దలిద్దరూ మృతిచెందారు. పిల్లలిద్దరూ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కరోనా మహమ్మారి ధాటికి రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందారు. ప్రస్తుతం మరొకరి పరిస్థితి విషమంగా మారింది. నెల్లూరు జిల్లా కొవ్వూరులో చోటుచేసుకున్న ఈ విషాదం కరోనా తీవ్రతను కళ్లకు కడుతోంది. మే 1న తల్లి, మే 4న తండ్రి, మే 6వ తేదీన సోదరి కరోనాకు బలికాగా.. మురళీకృష్ణ అనే వ్యక్తి వైరస్తో పోరాడుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!