Hassanabad Bridge: కళ్ల ముందే కూలిన వంతెన.. వైరల్ అవుతున్న వీడియో...
వేసవి కారణంగా ఏర్పడిన వేడి గాలులకు హిమనీనదాలు కరిగి వరదలు ఏర్పడ్డాయి. ఆ వరద తాకిడికి చారిత్రక వంతెన నేలకూలిపోయింది. దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: వేసవి కారణంగా ఏర్పడిన వేడి గాలులకు హిమనీనదాలు కరిగి వరదలు ఏర్పడ్డాయి. ఆ వరద తాకిడికి చారిత్రక వంతెన నేలకూలిపోయింది. దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇది ఎక్కడో అనుకోకండి పాక్ఆక్రమిత కశ్మీర్లో జరిగిన ఈ ఘటన వైరల్ అయ్యింది. హసనాబాద్ వంతెన శనివారం కూలిపోయింది. గిల్గిట్ - బాల్టిస్థాన్ ప్రాంతంలో ఉన్న ఈ వంతెన వరద నీటిలో కొట్టుకుపోయింది. వేల మంది స్థానికులు, పర్యాటకులు ఆ వరదల్లో చిక్కుకు పోయారు.
కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పాకిస్థాన్ మంత్రి షెర్రీ రెహ్మాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘పాకిస్థాన్ ఉత్తర భాగంలోని మౌంట్ షిప్పర్ సమీపంలో ఉన్న హిమనీనదాలు కరుగుతున్న కారణంగా ఈ హైవేపై ఉన్న వంతెన కూలిపోయింది’ అని ఆమె పేర్కొన్నారు. ఈ వరదల కారణంగా రెండు జల విద్యుత్తు ప్రాజెక్టులు, కొన్ని వందల ఇళ్లు, వ్యవసాయ భూములు అన్ని నీట మునిగాయి. త్వరలోనే తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేస్తామని స్థానిక అధికారులు తెలిపారు. ఇక ఈ సంవత్సరం ఏప్రిల్లో పాకిస్థాన్లో ఎన్నడూ లేనంతగా గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దశాబ్దకాలంగా ఎప్పూడూ లేనంతగా ఈ ఏప్రిల్లో 49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో దానిని హాటెస్ట్ ఏప్రిల్గా పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 30 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా