CA Exams: పరీక్ష రాయాలంటే.. తల్లిదండ్రుల అనుమతి ఉండాలి!
చార్టర్డ్ అకౌంటెంట్(సీఎ) పరీక్షలు రాయాలంటే అభ్యర్థులు వారి తల్లిదండ్రుల నుంచి అనుమతి తీసుకోవాలని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) వెల్లడించింది. సీఎ ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ పరీక్షలను డిసెంబర్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. నిర్వహించాలని ఐసీఏఐ
దిల్లీ: చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) పరీక్షలు రాయాలంటే అభ్యర్థులు వారి తల్లిదండ్రుల నుంచి అనుమతి తీసుకోవాలని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) వెల్లడించింది. సీఏ ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ పరీక్షలను డిసెంబర్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. నిర్వహించాలని ఐసీఏఐ నిర్ణయించింది. ఈ మేరకు సన్నాహాలు కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలో పరీక్షలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది.
‘‘పరీక్షలు రాసే అభ్యర్థులు.. కేంద్ర ప్రభుత్వం, ఐసీఏఐ సూచించిన కొవిడ్ మార్గదర్శకాలను పాటించాలి. పరీక్షలు రాయాలంటే అభ్యర్థుల తల్లిదండ్రులు/సంరక్షకుల అనుమతి తప్పనిసరి. పరీక్ష కేంద్రాల్లో థర్మల్ చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎవరికైనా అసాధారణ ఉష్ణోగ్రత ఉన్నా.. కరోనా లక్షణాలు కనిపించినా వారిని పరీక్షలకు అనుమతించరు’’ అని ఐసీఏఐ తెలిపింది. అభ్యర్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా మరికొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. సీఏ పరీక్ష కేంద్రాలను పెంచాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. కాగా.. కరోనా భయాల నేపథ్యంలో ఐసీఏఐ భారీగా పరీక్ష కేంద్రాలను పెంచింది. ఏ అభ్యర్థి కూడా తన జిల్లా పరిధిని దాటి వెళ్లాల్సిన అవసరం లేకుండా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఐసీఏఐ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 10 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్