CA Exams: పరీక్ష రాయాలంటే.. తల్లిదండ్రుల అనుమతి ఉండాలి!

చార్టర్డ్‌ అకౌంటెంట్‌(సీఎ) పరీక్షలు రాయాలంటే అభ్యర్థులు వారి తల్లిదండ్రుల నుంచి అనుమతి తీసుకోవాలని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) వెల్లడించింది. సీఎ ఫౌండేషన్‌, ఇంటర్‌, ఫైనల్‌ పరీక్షలను డిసెంబర్‌లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. నిర్వహించాలని ఐసీఏఐ

Published : 09 Nov 2021 19:51 IST

దిల్లీ: చార్టర్డ్‌ అకౌంటెంట్‌(సీఏ) పరీక్షలు రాయాలంటే అభ్యర్థులు వారి తల్లిదండ్రుల నుంచి అనుమతి తీసుకోవాలని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) వెల్లడించింది. సీఏ ఫౌండేషన్‌, ఇంటర్‌, ఫైనల్‌ పరీక్షలను డిసెంబర్‌లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. నిర్వహించాలని ఐసీఏఐ నిర్ణయించింది. ఈ మేరకు సన్నాహాలు కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలో పరీక్షలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది.

‘‘పరీక్షలు రాసే అభ్యర్థులు.. కేంద్ర ప్రభుత్వం, ఐసీఏఐ సూచించిన కొవిడ్‌ మార్గదర్శకాలను పాటించాలి. పరీక్షలు రాయాలంటే అభ్యర్థుల తల్లిదండ్రులు/సంరక్షకుల అనుమతి తప్పనిసరి. పరీక్ష కేంద్రాల్లో థర్మల్‌ చెకప్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎవరికైనా అసాధారణ ఉష్ణోగ్రత ఉన్నా.. కరోనా లక్షణాలు కనిపించినా వారిని పరీక్షలకు అనుమతించరు’’ అని ఐసీఏఐ తెలిపింది. అభ్యర్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా మరికొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. సీఏ పరీక్ష కేంద్రాలను పెంచాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ ఉంది. కాగా.. కరోనా భయాల నేపథ్యంలో ఐసీఏఐ భారీగా పరీక్ష కేంద్రాలను పెంచింది. ఏ అభ్యర్థి కూడా తన జిల్లా పరిధిని దాటి వెళ్లాల్సిన అవసరం లేకుండా పరీక్ష  కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఐసీఏఐ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు