చదువుల తల్లి మురిసింది
కరోనాతో ప్రభుత్వ కళాశాలల్లో అతిథి అధ్యాపకుల సేవలు నిలిచిపోయాయి. నెలలు గడిచినా సర్కారు నియామకాలు చేపట్టలేదు. ఈ పరిస్థితుల్లో పాఠ్యాంశాలు చెప్పేవారు లేక విద్యార్థులు పడుతున్న కష్టాలను వారి తల్లిదండ్రులు దూరం చేశారు....
ఒప్పంద అధ్యాపకులను నియమించిన తల్లిదండ్రులు
ఇంటర్నెట్ డెస్క్: కరోనాతో ప్రభుత్వ కళాశాలల్లో అతిథి అధ్యాపకుల సేవలు నిలిచిపోయాయి. నెలలు గడిచినా సర్కారు నియామకాలు చేపట్టలేదు. ఈ పరిస్థితుల్లో పాఠ్యాంశాలు చెప్పేవారు లేక విద్యార్థులు పడుతున్న కష్టాలను వారి తల్లిదండ్రులు దూరం చేశారు. అందరూ కొంతమేర డబ్బులు వేసుకొని అధ్యాపకులను నియమించి పిల్లలకు పాఠాలు చెప్పిస్తున్నారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం పురోహితుని వలసలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులు ఇంటర్ వరకు విద్యనభ్యసిస్తున్నారు. కరోనాకు ముందు ప్రభుత్వ అధ్యాపకులతోపాటు అతిథి అధ్యాపకులు బోధించేవారు. వీరిని ప్రభుత్వం ప్రస్తుతం నిలిపివేయడంతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, సివిక్స్, ఎకనమిక్స్, ఆంగ్లం చెప్పేవారు లేకుండాపోయారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసినా ఫలితం లేకుండాపోయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తలా కొంత సొమ్ము వేసుకొని ఒప్పంద ప్రాతిపదికన అధ్యాపకులను నియమించుకున్నారు. ప్రస్తుతం పిల్లల చదువులు సజావుగా సాగుతున్నాయి.
ఒక్కో విద్యార్థి తరఫున రూ.500 ఇస్తున్నారు. వీరికి తోడుగా ప్రిన్సిపల్ నెలకు రూ.5000, అధ్యాపకులు రూ.1500, రూ.1000 చొప్పున ఇస్తున్నారు. ప్రస్తుతం అన్ని సబ్జెక్టులు చెబుతుండటంతో తల్లిదండ్రులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారంపై విద్యార్థుల తల్లిదండ్రుల చొరవను ప్రిన్సిపల్ అభినందిస్తున్నారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకులు తీసుకున్న నిర్ణయంపై స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు