Andhra News: గుంటూరు జీజీహెచ్‌లో ఊడిపడిన పైకప్పు పెచ్చులు

గుంటూరు జీజీహెచ్‌లో పైకప్పు పెచ్చులు ఊడిపడటం కలకలం రేపింది. జీజీహెచ్‌లోని మెటర్నిటీ వార్డులోని కారిడార్‌లో పెచ్చులు ఊడి కిందపడ్డాయి.

Updated : 21 Apr 2022 19:46 IST

గుంటూరు: గుంటూరు జీజీహెచ్‌లో పైకప్పు పెచ్చులు ఊడిపడటం కలకలం రేపింది. జీజీహెచ్‌లోని మెటర్నిటీ వార్డులోని కారిడార్‌లో పెచ్చులు ఊడి కిందపడ్డాయి. ఆ సమయంలో వార్డులో ఎవరూ లేకపోవటంతో ముప్పు తప్పింది. పురాతన భవనం కావడంతో పైకప్పు చాలా చోట్ల పాడైపోయింది. దానికి మరమ్మతులు కూడా చేయించలేదు. బుధవారం వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు జీజీహెచ్‌ను సందర్శించారు. ఆ సమయంలో కూడా పెచ్చులు ఊడిపడుతున్న విషయాన్ని కొందరు వారి దృష్టికి తీసుకెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని