Tirumala: తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం
తిరుమలలో పార్వేట ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారు హత్తీరాంజీ వారి బెత్తం తీసుకొని సన్నిధిలోకి వెళ్లారు.
తిరుమల: కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఒక తిరుచ్చిలో శ్రీమలయప్ప స్వామి, మరో తిరుచ్చిలో శ్రీకృష్ణ స్వామి వేంచేయగా.. పార్వేట మండపంలో పుణ్యాహము, ఆరాధన, నివేదన హారతులిచ్చారు. అనంతరం శ్రీ కృష్టస్వామివారిని సన్నిధి యాదవ పూజ చేసిన చోటుకు తీసుకెళ్లి పాలు, వెన్న, హారతులు సమర్పించారు. ఆ తర్వాత శ్రీ మలయప్పస్వామివారు కొంత దూరము పరుగెత్తగా.. ఆయన తరపున అర్చకులు బాణమువేసిన తర్వాత వెనక్కి వచ్చారు. ఇలా మూడుసార్లు చేశారు. ఉత్సవం పూర్తయిన తర్వాత శ్రీ మలయప్ప స్వామివారు మహాద్వారమునకు వచ్చి హతీరాంజీవారి బెత్తమును తీసుకొని సన్నిధిలోనికి వెళ్లారు. ఇంతటితో పార్వేట ఉత్సవం ముగిసింది. ఈ ఉత్సవంలో జెఈఓ వీరబ్రహ్మం, ఎస్ ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, ఈఈ జగన్మోహన్ రెడ్డి, డిఇ రవి శంకర్ రెడ్డి, ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ శ్రీదేవి డిప్యూటీ ఈవో హరింద్రనాథ్, వీజివోలు బాలిరెడ్డి, గిరిధర్, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: వాణీకపూర్ ‘క్రైమ్ థ్రిల్లర్’.. చీరలో శోభిత హొయలు!
-
Politics News
BS Yediyurappa: సిద్ధూపై యడ్డీ తనయుడి పోటీ..?
-
World News
United Airlines: ఖరీదైన విస్కీ బాటిల్లో మద్యం చోరీ..కంగుతిన్న విమాన ప్రయాణికుడు
-
Politics News
Andhra News: ఉదయగిరికి వచ్చా.. దమ్ముంటే తరిమికొట్టండి: ఎమ్మెల్యే చంద్రశేఖర్రెడ్డి సవాల్
-
India News
అశ్లీల దృశ్యాలు చూస్తూ.. వివాదంలో ఎమ్మెల్యే..!
-
Sports News
Virat - Shah rukh Fans: విరాట్ - షారుక్ ఖాన్ ఫ్యాన్స్ ట్విటర్ వార్.. ఓ యూజర్ సూపర్ ట్వీట్