Ap News: పశువుల పండుగ.. సినీ, రాజకీయ ప్రముఖుల ముఖచిత్రాలతో అలంకరణ

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పశువుల పండుగ పెద్ద ఎత్తున జరుగుతోంది. జిల్లాలోని పుల్లయ్యవారిపల్లె,

Updated : 16 Jan 2022 13:15 IST

చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పల్లెల్లో కోలాహలం నెలకొంది. కనుమ రోజు నిర్వహించే పశువుల పండుగ సంప్రదాయబద్ధంగా జరుగుతోంది. చంద్రగిరి నియోజకవర్గంలోని పుల్లయ్యవారిపల్లె, ఎ.రంగంపేట, శేషాపురంలో.. పరిసర గ్రామాల రైతులు ఆవులు, కోడెలను తీసుకొచ్చి అందంగా అలంకరించారు. ఎద్దుల కొమ్ములకు సినీ, రాజకీయ ప్రముఖుల ముఖచిత్రాల పటాలను తగిలించి వదిలేశారు. పటాలు చేజిక్కించుకొనేందుకు యువకులు పోటీ పడుతున్నారు. పోటీలను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీధుల్లోని నివాసాలపైకి ఎక్కి వీక్షిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని