Pawan Kalyan: యువ క్రికెటర్‌కు పవన్‌ కల్యాణ్‌ ఆర్థిక సాయం..

భారత అండర్-19 క్రికెట్‌ టీమ్‌ వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేశారు.

Published : 09 Mar 2022 01:13 IST

గుంటూరు: భారత అండర్-19 క్రికెట్‌ టీమ్‌ వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేశారు. పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సెలెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి సాయం అందించారు. జనసేన నాయకులు.. గుంటూరులోని రషీద్ నివాసానికి వెళ్లి పవన్ కల్యాణ్ తరఫున చెక్కును రషీద్‌కు ఇచ్చారు. పవన్‌ తరఫున యువ క్రికెటర్‌కు అభినందనలు తెలిపారు. త్వరలో రషీద్‌ను పవన్‌ కలుస్తారని చెప్పారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని