Andhra News: పెదకాకాని ఆలయ క్యాంటీన్ సీజ్.. నిర్వాహకుల లైసెన్స్ రద్దు
గుంటూరు జిల్లాలోనే పేరుగాంచిన పెదకాకాని మల్లేశ్వరస్వామి శివాలయం క్యాంటీన్లో మాంసాహారం వండిన ఘటనపై అధికారులు
పెదకాకాని: గుంటూరు జిల్లాలోనే పేరుగాంచిన పెదకాకాని మల్లేశ్వరస్వామి శివాలయం క్యాంటీన్లో మాంసాహారం వండిన ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. క్యాంటీన్ను దేవాదాయశాఖ అధికారులు మూసివేశారు. ఆలయ క్యాంటీన్ను సీజ్ చేశామని.. నిర్వాహకుల లైసెన్స్ను రద్దు చేశామని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఈమని చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. క్యాంటీన్ ఘటనపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు.
మాంసాహారాన్ని బయటే వండినట్లు.. దానికి సంబంధించిన వాహనం ఆలయ ప్రాంగణంలోకి వచ్చినట్లు నిర్వాహకులు చెప్పారని చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై నిన్ననే నిర్వాహకులకు షోకాజ్ నోటీసు ఇచ్చామన్నారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. నిర్వాహకుల వివరణ రాగానే తదుపరి చర్యలు చేపడతామన్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయా? అనే అంశంపైనా విచారిస్తామన్నారు. ఇతర మతస్థులు క్యాంటీన్ నిర్వహణ చేస్తున్నట్లు తమకు తెలియదని ఈమని చంద్రశేఖర్రెడ్డి చెప్పారు.
ఈవో కార్యాలయం వద్ద ఆందోళన
మరోవైపు ఈ ఘటనపై హిందూ ధార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈవో కార్యాలయం వద్ద హిందూ సంఘాల నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. ఆలయ పవిత్రను దెబ్బతీసే కార్యకలాపాలు సాగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. క్యాంటీన్ టెండర్ల దశ నుంచే అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆలయ క్యాంటీన్లో మాంసాహారం వండిన ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే..
పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయానికి నిత్యం వచ్చే భక్తులకు అల్పాహారం, అన్నదానానికి భోజనాన్ని అక్కడి క్యాంటీన్ నుంచే సరఫరా చేస్తారు. అదే క్యాంటీన్లో కోడి మాంసం వండటం విమర్శలకు తావిచ్చింది. ఇటీవలే ఓ వ్యక్తి వేలం పాటలో ఈ హోటల్ను దక్కించుకున్నారు. ఆయన దగ్గర నుంచి అధికార పార్టీకి చెందిన స్థానిక ఎంపీటీసీ భర్త లీజుకు తీసుకుని నడుపుతున్నారు. భక్తులకు ఆహార పదార్థాలు తయారు చేయడమే కాక బయట వారికి ఆర్డర్లపై క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం క్యాంటీన్ ముందు రిక్షాపై అన్నం, కూరల పాత్రలతో పాటు మాంసం కూర కూడా కనిపించడంతో భక్తులు గమనించి ఫొటోలు తీశారు. ఈ విషయం చర్చనీయాంశం కావడం.. విమర్శలు రావడంతో తాజాగా క్యాంటీన్ను సీజ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM