కస్టమర్లు చేసే తప్పులకు మేము ఎలా బాధ్యత వహిస్తాం?
తమ వినియోగదారులు చేసే తప్పులకు తామెలా బాధ్యులవుతామని పెగాసస్ స్పైవేర్ తయారీ కంపెనీ ఎన్.ఎస్.ఒ గ్రూపు ప్రశ్నిస్తోంది. స్పైవేర్ను తయారు చేసినందుకు ఈ సంస్థ గత కొద్దిరోజులుగా అంతర్జాతీయంగా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటోంది. దాదాపు నలభై దేశాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, దేశాధినేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు పెగాసస్ స్పైవేర్ బారిన పడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: తమ వినియోగదారులు చేసే తప్పులకు తామెలా బాధ్యులవుతామని పెగాసస్ స్పైవేర్ తయారీ కంపెనీ ఎన్.ఎస్.ఒ గ్రూపు ప్రశ్నిస్తోంది. స్పైవేర్ను తయారు చేసినందుకు ఈ సంస్థ గత కొద్దిరోజులుగా అంతర్జాతీయంగా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటోంది. దాదాపు నలభై దేశాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, దేశాధినేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు పెగాసస్ స్పైవేర్ బారిన పడ్డారు. దాదాపు 50 వేల ఫోన్ నంబర్ల జాబితా లీక్ అయింది. ఈ స్పైవేర్ సాయంతో ఏ కంపెనీ ఫోన్నైనా హ్యాక్ చేయవచ్చు. ఐ ఫోన్కు కూడా దీనినుంచి రక్షణ లేదు.
పెగాసస్ను తయారు చేసిన సంస్థ దీనిని కేవలం ఉగ్రవాదులు, నేరచరితులపై నిఘా పెట్టడానికి రూపొందించిందని చెబుతోంది. కానీ దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గూఢచర్యం చేసినట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్ దేశాధ్యక్షుని నంబర్ కూడా ఈ స్పైవేర్కు లక్ష్యంగా ఉన్నట్లు ఆ దేశంలో మీడియా కథనాలు వెలువడ్డాయి. కానీ ఎన్.ఎస్.ఒ. గ్రూపు ప్రతినిధి మాత్రం ఇందులో తమ కంపెనీ తప్పేమీ లేదని చెబుతున్నారు. తమకంపెనీ కస్టమర్లు కేవలం కొన్ని వందలు మాత్రమేననీ, వేలల్లో మాకు వినియోగదార్లు లేరని బుకాయిస్తున్నారు.
మరోవైపు ఇజ్రాయెల్ దేశమే అణచివేతకు పెట్టింది పేరనీ, కాబట్టి అణచివేతకు పాల్పడే మిగతా దేశాల ప్రభుత్వాలకు ఈ స్పైవేర్ను అమ్మారని అనేకమంది విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల ప్రారంభంలోనే ఎస్ఎస్ఒ గ్రూప్ తన ట్రాన్స్పరెన్నీ నివేదికను బహిర్గతం చేయడం విశేషం. ఆ రిపోర్టులో ‘మానవహక్కులు, ప్రజల గోప్యత, భద్రతను ఎప్పటికప్పుడు గ్యారంటీ చేయడానికి పారదర్శకంగా పని చేయాలి’ అని తెలిపింది. గత బుధవారం ఇటీవలి పరిణామాలపై స్పందించిన ఆ కంపెనీ ప్రతినిధి, ‘‘తమ క్లయింట్లు తప్పు చేస్తే దానికి తమదెలా బాద్యతవుతుంది?మేం ఈ స్పైవేర్ను ప్రభుత్వాలకు అమ్మాం. ఇదంతా
చట్టపరంగానే జరిగింది. మా వినియోగదార్లు దాన్ని దుర్వినియోగపరిస్తే అలాంటివారితో తెగతెంపులు చేసుకుంటాం. కానీ వినియోగదార్లు చేసే తప్పులకు వారిదే బాధ్యత. ఇందులో కంపెనీకేమీ సంబంధం లేదు’’ అని అన్నారు. పెగాసస్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా దుమారం రేగడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ స్పైవేర్ దుర్వినియోగంపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది. ఇదిలావుంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తన ఫోన్ నంబరు కూడా పెగాసస్ జాబితాలో ఉండటంతో, ఈ మొత్తం వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఐక్యరాజ్యసమితిని కోరతామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..