బిహార్లో ఎంపీపై వరద బాధితుల దాడి
బిహార్లో వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు సహాయక చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సివాన్ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన భాజపా ఎంపీ జనార్ధన్ సింగ్ సిగ్రివాల్పై స్థానికులు కుర్చీలతో దాడి చేశారు.
సివాన్: బిహార్లో వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు సహాయక చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సివాన్ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన భాజపా ఎంపీ జనార్ధన్ సింగ్ సిగ్రివాల్పై స్థానికులు కుర్చీలతో దాడి చేశారు. సివాన్ జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించి లక్రినాబిగజ్కు వచ్చిన సిగ్రివాల్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. వారిలో కొంత మంది ఎంపీ సహా ఆయనతో పాటు వచ్చిన అధికారుల పైకి కుర్చీలు విసిరారు. చాలా మంది రాజకీయ నాయకులు తమ ప్రాంతాల్లో పర్యటించినా ఎవరూ తమకు సహాయం చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొంత మంది ఎంపీ సిగ్రివాల్ను కలిసి సమస్యలు విన్నవించినా తమకు ఎలాంటి భరోసా ఇవ్వలేదని అంటున్నారు. ఈ కారణంగానే ఎంపీపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. భారీ వరదల కారణంగా బిహార్లో ఇప్పటి వరకు 23 మంది మృతి చెందారు. 74లక్షల మందిపై తీవ్ర ప్రభావం పడింది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ