ఆర్టీసీ పయనమంటేనే అమ్మో..!
వర్షాకాలంతో అధ్వానంగా మారిన రోడ్లు, కాలం గడిచిపోయిన ఆర్టీసీ బస్సులు.. వెరసి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన ప్రయాణికుల్లో అధికమవుతోంది.
అమరావతి: వర్షాకాలంలో అధ్వానంగా మారిన రోడ్లు, కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన ప్రయాణికుల్లో అధికమవుతోంది. క్షేమంగా గమ్యస్థానాలకు చేరతామో.. లేదో తెలియని పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ ప్రయాణికులది. ఇటీవల వరుస ప్రమాదాలు దీనికి ఉదాహరణలు. ఏటా 2 వేల కొత్త బస్సులు రావాల్సి ఉన్నా.. నిధులు రాక పాత బస్సులకే మరమ్మతులు చేసి ఆర్టీసీ నడిపిస్తోంది.
ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల ప్రమాదాలు చూశాక వాటిలో ప్రయాణమంటేనే ప్రజలు ఆలోచిస్తున్నారు. గుంతలమయమైన రోడ్లపై కాలం చెల్లిన బస్సుల్ని నడుపుతుండటం వల్ల ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి ఘోరంగా తయారవడంతో ఆటోలు, ప్రైవేటు వాహనాలు నిలిపేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో కండిషన్లో లేని ఆర్టీసీ బస్సులు ఎక్కుతున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తోంది.
నిబంధనల ప్రకారం 10 లక్షలకు పైగా తిరిగిన బస్సులను ఆర్టీసీ పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఆర్టీసీకి 9,039 సొంత బస్సులుండగా.. అందులో 10 లక్షల కిలోమీటర్లకు పైగా 4,588 బస్సులు తిరిగాయి. 12 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన 2,800 బస్సులను సరకు రవాణాకు తరలించాల్సి ఉన్నా.. కొత్త బస్సులు లేకపోవడంతో పాత బస్సులకే రంగులేసి.. మరమ్మతులు చేసి సర్వీసులు నడిపిస్తున్నారు. ఏటా 2 వేల కొత్త బస్సుల కొనుగోలుకు రూ.300 కోట్ల వరకు కేటాయించే ప్రభుత్వం.. కొన్నేళ్లుగా దానిని నిలిపేసిందని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవాటిని తీసుకురాకపోతే.. ఏదైనా అనర్థం జరిగితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..