Telangana News: లక్ష్మీపూర్‌ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి

నిర్మల్‌ జిల్లాలో లక్ష్మీపూర్‌ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కడెం ఎడమ గట్టున పాండ్వపురి వంతెన సమీపంలో ఈ ఎత్తిపోతల

Updated : 30 Aug 2022 14:13 IST

నిర్మల్‌: నిర్మల్‌ జిల్లాలో లక్ష్మీపూర్‌ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కడెం ఎడమ గట్టున పాండ్వపురి వంతెన సమీపంలో ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నారు. ఈ మేరకు లక్ష్మీపూర్‌ ఎత్తిపోతల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ నీటి పారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 0.23 టీఎంసీల నీటివినియోగం కోసం రూ.40.1 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల నిర్మాణం చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు