Ap news: వారికి ఆర్టీసీ బస్సుల్లో చికిత్స
వైద్య సదుపాయాలు తక్కువగా ఉండే ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్టీసీ స్లీపర్ బస్సుల్లో కొవిడ్ రోగులకు చికిత్స అందించాలని నిర్ణయించింది
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నిత్యం వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మృతుల సంఖ్య కూడా రోజూ 100కు అటూఇటూగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనాతో బాధపడేవారికి ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా వైద్య సదుపాయాలు తక్కువగా ఉండే ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్టీసీ స్లీపర్ బస్సుల్లో కొవిడ్ రోగులకు చికిత్స అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు.
ఏజెన్సీ ప్రాంతాలైన బుట్టాయిగూడెం, కె.ఆర్.పురం పీహెచ్సీలో ఆక్సిజన్ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆస్పత్రులు అందుబాటులో లేని ప్రాంతాల్లో బస్సులను అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రస్తుతం 10 ఆర్టీసీ స్లీపర్ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భవిష్యత్తులో మరిన్ని ఆర్టీసీ స్లీపర్ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రయోగాత్మకంగా వెన్నెల బస్సుల్ల్లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బెడ్లను మంత్రి ఈ సందర్భంగా పరిశీలించారు. బస్సుల్లో ఏర్పాట్లు సహా సదుపాయాలను ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ మంత్రి నానికి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.