బ్రహ్మంగారిమఠం పీఠాధిపత్యంపై పిటిషన్‌

కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో కొలిక్కి వచ్చిందనుకుంటున్న పీఠాధిపత్యం వివాదం మళ్లీ మొదటికొచ్చినట్లు కనిపిస్తోంది. దివంగత పీఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ పీఠాధిపతి విషయంపై

Updated : 30 Jun 2021 12:36 IST

అమరావతి: కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో కొలిక్కి వచ్చిందనుకుంటున్న పీఠాధిపత్యం వివాదం మళ్లీ మొదటికొచ్చినట్లు కనిపిస్తోంది. దివంగత పీఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ పీఠాధిపతి విషయంపై హైకోర్టును ఆశ్రయించింది. పెద్ద మనుషుల రాజీ చర్చల్లో బలవంతంగా తమను ఒప్పించారని ఆరోపిస్తూ ఆమె పిటిషన్‌ దాఖలు చేశారు. పీఠాధిపతి నియామకం అనేది వీలునామా ప్రకారమా.?లేదా కుటుంబ సభ్యుల ఒప్పందం ప్రకారమా?అనేది తేల్చాలని హైకోర్టుకు విన్నవించారు. వీలునామా ప్రకారం తన కుమారుడికే పీఠాధిపత్యం దక్కాలని కోరుకుంటున్నానన్నారు. వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని పిటిషన్‌ వేసినట్లు వివరించారు. ఈ విషయాన్ని భక్తులు, గ్రామస్థులు అర్థం చేసుకోవాలని ఆమె కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని