Lockdown: వాడిపోతున్న వ్యాపారాలు
లాక్ డౌన్ కారణంగా చిరువ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. క్రయవిక్రయాలకు 4 గంటల సమయం ఇస్తున్నా కూరగాయల వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది.
హైదరాబాద్: లాక్ డౌన్ కారణంగా చిరువ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. క్రయవిక్రయాలకు 4 గంటల సమయం ఇస్తున్నా కూరగాయల వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. ఉదయాన్నే కొనుగోలుదారులు రాకపోవడంతో కరీంనగర్ మార్కెట్లో కూరగాయలు చెడిపోతున్నాయని వాపోతున్నారు. కఠిన నిబంధనల అమలుతో వ్యాపారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ ప్రభావం కూరగాయల రైతులు, విక్రయదారులపై పడుతుంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకూ ఆంక్షలు సడలించినా కొనుగోలు దారులు 8 గంటల తర్వాతే వస్తున్నారని చెబుతున్నారు. పోలీసులు 9:30 గంటలకే దుకాణాలు మూసివేయిస్తుండగా, కూరగాయలు అమ్ముడుపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి ఎక్కువ ధరకి కూరగాయలు తీసుకువచ్చి విక్రయాలు జరగక పారేస్తున్నామని వాపోతున్నారు. మరో రెండు గంటల సమయం ఇస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!