టెలీస్కోప్లో అరుంధతి.. వరుడి వినూత్న ఆలోచన!
వివాహ వేడుకల్లో వరుడు వధువుకు అరుంధతి నక్షత్రం చూపించడం సహజం. చాలామందికి నక్షత్రం కనిపించకపోయినా చూసినట్లుగా ఫొటోలు దిగుతుంటారు. కానీ, ఆ వరుడు టెలీస్కోప్ను ఉపయోగించి వధువుకు నిజంగానే నక్షత్రాన్ని చూపించాడు. జగిత్యాల జిల్లా........
మేడిపల్లి (జగిత్యాల): వివాహ వేడుకల్లో వరుడు వధువుకు అరుంధతి నక్షత్రం చూపించడం సహజం. చాలామందికి నక్షత్రం కనిపించకపోయినా చూసినట్లుగా ఫొటోలు దిగుతుంటారు. కానీ, ఆ వరుడు టెలీస్కోప్ను ఉపయోగించి వధువుకు నిజంగానే నక్షత్రాన్ని చూపించాడు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కల్వకోటలో ఆదివారం జరిగిన వివాహ వేడుకలో ఈ వినూత్న ఆలోచనకు బీజం పడింది. జాతీయస్థాయిలో భౌతిక శాస్త్రంలో 75వ ర్యాంకు పొందిన కడకుంట్ల అభయ్ రాజ్ దీనికి శ్రీకారం చుట్టారు.
కల్వకోటకు చెందిన గుండేటి శివానికి, రాయికల్కు చెందిన భౌతిక శాస్త్రం ప్రభుత్వ ఉపాధ్యాయుడు అభయ్ రాజ్తో వివాహం జరిగింది. అభయరాజ్ రాయికల్ మండలం రామారావు పల్లిలో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. భౌతికశాస్త్రంలో పలు సృజనాత్మక ఆవిష్కరణలకు ఆయన నాంది పలికారు. తన పాఠశాలలో విద్యార్థులతో భౌతిక శాస్త్రంలో పలు అంశాలను రూపొందించగా.. రెండుసార్లు దక్షిణ భారత స్థాయి సైన్స్ఫేర్లో చెన్నై, బెంగళూరులో బహుమతులు సాధించారు. ‘ఈనాడు’ హాయ్ బుజ్జి నిర్వహించిన వృక్ష మిత్ర పోటీల్లోనూ ఆయన విద్యార్థులు బహుమతులు పొందారు.
పెళ్లి వేడుకల్లో అరుంధతి నక్షత్రాన్ని చూపించినట్లు కేవలం తంతుగా కొనసాగుతుండగా.. అభయ్ రాజ్ మాత్రం టెలిస్కోప్ లెన్స్ సాయంతో నిజమైన అరుంధతి నక్షత్రాన్ని చూపించినట్లు చెప్పారు. చీకట్లో నక్షత్రాలు కనిపించడం సహజమని, కానీ మధ్యాహ్నం టెలిస్కోప్ సాయంతో అరుంధతి నక్షత్రం చూపించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ వేడుకలో అరుంధతి నక్షత్రాన్ని వరుడు అభయ్ రాజ్ టెలిస్కోప్ ద్వారా చూపించిన విధానం అక్కడి వారిని ఆకట్టుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు