Andhra News: వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం
విజయనగరం శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజల అనంతరం పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమాను అధిరోహించగా.. పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
విజయనగరం గ్రామీణం: విజయనగరం శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆలస్యంగా సాయంత్రం 5గంటలకు ఉత్సవాన్ని ప్రారంభించారు. అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజల అనంతరం పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమాను అధిరోహించగా.. పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. 3 లాంతర్లు మీదుగా కోట వరకు 3 సార్లు సిరిమాను ఊరేగింపు జరిగింది. ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు కోట బురుజు మీద నుంచి ఉత్సవాన్ని తిలకించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు, ఉప సభాపతి కొలగట్ల వీరభద్రస్వామి, కలెక్టర్ సూర్య కుమారి, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితరులు డీసీసీబీ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఉత్సవాన్ని వీక్షించారు. సిరిమానోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో విజయనగరం జనసంద్రంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా