అక్కడకు వరాహాలు ఎలా వచ్చాయబ్బా?
బహమాస్ దేశం ఒక ఐలాండ్ల సమూహం. ఏటా లక్షల మంది ఇక్కడి ఐలాండ్స్ను సందర్శించేందుకు వస్తుంటారు. ఆ దేశ జీడీపీలో సగభాగం పర్యటక రంగానిదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో అందమైన ఐలాండ్స్, ఆకట్టుకునే ప్రదేశాలు, సంస్కృతి, సంప్రదాయాలు
ఇంటర్నెట్ డెస్క్: బహమాస్ దేశం దీవుల సమూహం. ఏటా లక్షల మంది పర్యటకులు ఇక్కడి ఐలాండ్స్ను సందర్శించేందుకు వస్తుంటారు. ఆ దేశ జీడీపీలో సగభాగం పర్యటక రంగానిదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో అందమైన ఐలాండ్స్, ఆకట్టుకునే ప్రదేశాలు, సంస్కృతి, సంప్రదాయాలు పర్యటకులను బాగా ఆకర్షిస్తాయి. అయితే ఇక్కడి ఐలాండ్స్లో కొన్ని జనావాసాలు కాగా.. మరికొన్నింట్లో జనసంచారం ఉండదు. ఇలాంటి నిర్మానుష్య ఐలాండ్స్లో ఒకటి చాలా కాలంగా పర్యటకులను తెగ ఆకట్టుకుంటుంది. ఎందుకంటే ఆ ఐలాండ్ మొత్తం పందులే ఉన్నాయి. దీంతో ఆ ఐలాండ్ను ‘పిగ్స్ బీచ్’గా పిలుస్తున్నారు. బీచ్లో ఆటలాడుతూ.. ఈత కొట్టే పందులను చూసేందుకు పర్యటకులు ఆసక్తి కనబరుస్తున్నారు.
అయితే, ఈ ఐలాండ్కు పందులెలా వచ్చాయో ఇప్పటికీ ఎవరికి అంతుచిక్కట్లేదు. కానీ, పలు వాదనలు వినిపిస్తున్నాయి. పూర్వం కొందరు నావికులు మార్గమధ్యంలో ఈ ఐలాండ్కు వచ్చి పందుల్ని వదిలేశారట, తిరుగు ప్రయాణంలో వీటిని ఇక్కడే వండుకొని తిని వెళ్లొచ్చని భావించారట. కానీ, వాళ్లు తిరిగి రాకపోవడంతో పందులు ఇక్కడే ఉండిపోయాయని, పిల్లల్ని కని వాటి సంఖ్యను పెంచుకున్నాయని అంటున్నారు. మరికొందరు ఈ దీవి సమీపంలో ఏదైనా ఓడ ప్రమాదానికి గురై ఉంటుందని, ఆ ఓడలో ఉన్న పందులే ఈదుకుంటూ ఇక్కడకు చేరి ఉంటాయని చెబుతున్నారు. నావికులు ఈ మార్గం గుండా వెళ్తూ పారేసిన ఆహారాన్ని తింటూ జీవిస్తున్నాయని భావిస్తున్నారు. ఇంకొందరు బహమాస్ ప్రభుత్వమే పర్యటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా పందుల్ని ఆ ఐలాండ్లో వదిలిపెట్టి ఉంటుందని వాదనలు వినిపిస్తున్నారు. అయితే వీటిలో ఏది నిజమనేది నిర్థారణ కాలేదు. ఈ పందులు ఎలా వచ్చాయనే దానికన్నా.. వాటి వల్ల పర్యటకుల సంఖ్య పెరగడం మంచి పరిణామమని అక్కడి ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేస్తోంది.
అలా ఈ పిగ్ బీచ్లో ప్రస్తుతం 20కిపైగా పందులు ఎంతో లగ్జరీగా బతికేస్తున్నాయి. సందర్శకులు, ఇరుగుపొరుగు దీవుల్లో ఉండే స్థానిక ప్రజలు రోజూ వీటికి ఆహారం అందిస్తున్నారు. దీంతో ఆహారం తింటూ ఐలాండ్ మొత్తం తిరుగుతూ.. సముద్రంలో ఈత కొడుతూ పందులు జల్సా చేస్తున్నాయి. వాటిని చూసి పర్యటకులు మురిసిపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Cyclone Michaung: మిగ్జాం ఎఫెక్ట్.. కూలిన వృక్షాలు.. రహదారులు జలమయం
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాపై ‘మిగ్జాం’ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో పలుచోట్ల వృక్షాలు నేలకొరిగాయి. -
Telangana Rains: మంగళ, బుధవారాల్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటన చేసింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడి భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. -
Trains Cancelled: మిగ్జాం తుపాన్ ప్రభావంతో పలు రైళ్లు రద్దు: ద.మ రైల్వే
మిగ్జాం తుపాన్(Cyclone Michaung) ప్రభావంతో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central railway) ప్రకటించింది. -
Cyclone Michaung: బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన మిగ్జాం.. భారీగా ఈదురు గాలులు
తీవ్ర తుపాను మిగ్జాం (Cyclone Michaung) బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. ఈ మేరకు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. -
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బాపట్ల తీరానికి అత్యంత దగ్గరగా ‘మిగ్జాం’.. గంటకు 12కిమీ వేగంతో..
తీవ్ర తుపాను మిగ్జాం (Cyclone Michaung) మరికొద్ది గంటల్లో తీరం దాటనుంది. బాపట్ల సమీపంలోకి తుపాను వచ్చినట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి సునంద తెలిపారు. బాపట్ల తీరానికి అత్యంత దగ్గరగా ‘మిగ్జాం’ కదులుతోందని చెప్పారు. -
మిగ్జాం ఎఫెక్ట్: కూలిన చెట్లు.. విద్యుత్ స్తంభాలు.. వేలాది ఎకరాల్లో పంట నష్టం
మిగ్జాం తీవ్ర తుపాను (Cyclone Michaung) ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. -
Vizag Airport: తుపాను ప్రభావం.. విశాఖ నుంచి 23 విమానాలు రద్దు
మిగ్జాం తుపాను(Cyclone Michaung) ప్రభావం కారణంగా పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విశాఖ ఎయిర్పోర్టు డైరెక్టర్ వెల్లడించారు. -
మిగ్జాం ఎఫెక్ట్.. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వర్షం
మిగ్జాం తుపాను (Cyclone Michaung) ప్రభావంతో తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ (Hyderabad)తో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో వర్షం పడుతోంది. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Cyclone michaung: తరుముకొస్తోన్న ‘మిగ్జాం’.. 90-110 కి.మీ వేగంతో ఈదురు గాలులు!
మిగ్జాం తుపాను (Cyclone michaung) తరుముకొస్తోంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా కావలికి 40కి.మీ, బాపట్లకు 80 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/12/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.


తాజా వార్తలు (Latest News)
-
ప్లీజ్.. మా వాళ్లను సైన్యంలోకి తీసుకోవద్దు: రష్యాను కోరిన నేపాల్
-
Hamas: ఇజ్రాయెల్ అణు క్షిపణి స్థావరంపై అక్టోబర్ 7న దాడి..!
-
America: గన్తో కాల్పులు.. ఇంట్లో భారీ పేలుడు
-
IPL 2024: కామెరూన్ గ్రీన్ ట్రేడింగ్.. ఆర్సీబీకి గొప్ప ఛాయిస్ కాదు: బ్రాడ్ హాగ్
-
Vishnu Vishal: తుపాను ఎఫెక్ట్.. సాయం కోరిన హీరో.. స్పందించిన రెస్క్యూ విభాగం
-
Cyclone Michaung: మిగ్జాం ఎఫెక్ట్.. కూలిన వృక్షాలు.. రహదారులు జలమయం