AP news: ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో రైతు భరోసా కేంద్రాలా..?
పాఠశాల స్థలాల్లో ఏర్పాటు చేసిన ఆర్బీకేలను 4 వారాల్లో తొలగించాలని హైకోర్టు ఆదేశాలు
4 వారాల్లో నిర్మాణాలను తొలగించండి: హైకోర్టు
అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు), సచివాలయాలు నిర్మించడంపై హైకోర్టులో విచారణ జరిగింది. మొత్తం ఏడుగురు ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్, బి.రాజశేఖర్, వి.చినవీరభద్రుడు, శ్యామలరావు తదితరులు విచారణకు హాజరయ్యారు. మొత్తం 1160 చోట్ల ఆర్బీకేలు, సచివాలయాలు నిర్మించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే 450 నిర్మాణాలను మరో చోటకు తరలించినట్లు అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో మిగతా నిర్మాణాలను 4 వారాల్లో తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేసింది.
తుది తీర్పునకు లోబడే లోకాయుక్త ఏర్పాటు
మరోవైపు కర్నూలులో హెచ్ఆర్సీ, లోకాయుక్తపై దాఖలైన పిటిషన్పైనా హైకోర్టులో విచారణ జరిగింది.హెచ్ఆర్సీ, లోకాయుక్త ఏర్పాటు తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ లోకాయుక్త కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేసే దిశగా చర్యలు మొదలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి గత శనివారం నగరంలో పర్యటించారు. ఇన్ఛార్జి కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్తో కలిసి ఎంపిక చేసిన మూడు భవనాలను ఆయన పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ అతిథి గృహంలో జేసీ రామసుందర్రెడ్డి ఇతర జిల్లా అధికారులతో సమీక్షించారు. మూడు భవనాల్లో ఒకటి ఎంపిక చేసే అవకాశం ఉందని, కార్యాలయ ఏర్పాట్లకు కొంత గడువు కోరినట్లు జిల్లా అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం