Polavaram project: నచ్చినట్టు నివేదికలు వచ్చే వరకు అధ్యయనం చేయాలా?: శశిభూషణ్
పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ 15వ సమావేశం హైదరాబాద్లో జరిగింది. ప్రధాన డ్యామ్ గ్యాప్ పనులను 2023 డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు.
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టులో భాగంగా దిగువ కాపర్ డ్యామ్ పనులు వచ్చే ఏడాది జనవరి నెలాఖరుకు పూర్తి చేస్తామని, 2023 జూన్ నాటికి ప్రధాన డ్యామ్ పనులు గ్రౌండ్ లెవల్ వరకు తీసుకొస్తామని ఏపీ జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ (పీపీఏ) 15వ సమావేశం హైదరాబాద్లో జరిగింది. కృష్ణా-గోదావరి భవన్లో పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణరెడ్డి, తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్, ఇంజినీర్లు, కేంద్ర జలసంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఎజెండాలోని 15 అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది.
ఉమ్మడి సర్వేకు ఏపీ అంగీకరించింది: తెలంగాణ ఈఎన్సీ
పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వచ్చే ముంపునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రాతపూర్వకంగా కొన్ని వివరాలు సమర్పించింది. బ్యాక్ వాటర్ కారణంగా 892 ఎకరాలు ముంపునకు గురవుతోందని, స్థానిక ప్రవాహాలు, డ్రైనేజీ తదితరాల కారణంగా ముప్పు పొంచి ఉందని పేర్కొంది. 2022 జులై వరదల సందర్భంగా వచ్చిన ముంపు, నష్టాన్ని అందులో పొందుపర్చారు. పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని తరలించేలా ఏపీ ప్రభుత్వం అనుమతుల్లేకుండా ఎత్తిపోతల పథకాలు చేపట్టిందని పేర్కొంది. పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా తెలంగాణలో ముంపు విషయాన్ని పీపీఏ సమావేశంలో ప్రస్తావించామన్న తెలంగాణ ఈఎన్సీ మురళీధర్.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల అంశాలను కేంద్ర జలసంఘం పరిగణనలోకి తీసుకొని అధ్యయనం చేయిస్తుందన్నారు. ఉమ్మడి సర్వేకు ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి కూడా అంగీకరించినట్టు తెలిపారు.
2023 డిసెంబరు నాటికి ప్రధాన డ్యామ్ పనులు పూర్తి చేస్తాం.. శశిభూషణ్
రానున్న వర్కింగ్ సీజన్లో పోలవరం ప్రాజెక్టు పనుల లక్ష్యాలు, వనరులపై ప్రణాళిక సిద్ధం చేసి ఆమోదించినట్టు ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. ప్రధాన డ్యామ్కు సంబంధించిన పనుల ప్రారంభం కోసం డయాఫ్రమ్ వాల్ పరిస్థితిని పరీక్షిస్తామని, ప్రధాన డ్యామ్ గ్యాప్ పనులను 2023 డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. అన్ని అంశాలను అధ్యయనం చేశాకే పోలవరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు వచ్చాయని, ఉమ్మడి అధ్యయనం, సర్వే అంటూ ఏదీ ఉండదని వ్యాఖ్యానించారు. జాతీయ ప్రాజెక్టుకు అనుమతులు రావడం పిల్లచేష్టలు కాదన్న శశిభూషణ్ కుమార్.. నచ్చినట్లు నివేదికలు వచ్చే వరకు అధ్యయనం చేయాలా? అని ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలతో చర్చించి ఏకాభిప్రాయానికి రావాలని సుప్రీంకోర్టు తెలిపిందని... ఇప్పటివరకు జరిగిన రెండు సమావేశాల్లో ఎలాంటి ఫలితం లేదన్నారు. ఏకాభిప్రాయం కోసం త్వరలోనే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తారని చెప్పినట్లు తెలిపారు. రెండో దశలో మరో 30 నుంచి 40 వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉందని... ఇందుకోసం షెడ్యూల్ సిద్ధం చేసి ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. పీపీఏ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించే కసరత్తు జరుగుతోందని శశిభూషణ్ కుమార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్