Polavaram: పోలవరం రివైజ్డ్‌ డీపీఆర్‌ పెండింగ్‌లో లేదు: కేంద్రం

ఏపీ చేపట్టిన పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్‌ డీపీఆర్‌ తమ వద్ద పెండింగ్‌లో లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2009 జనవరి 20 లోపు వచ్చిన ఏ డీపీఆర్‌ కూడా పెండింగ్‌లో

Updated : 02 Aug 2021 15:16 IST

దిల్లీ: ఏపీ చేపట్టిన పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్‌ డీపీఆర్‌ తమ వద్ద పెండింగ్‌లో లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2009 జనవరి 20 లోపు వచ్చిన ఏ డీపీఆర్‌ కూడా పెండింగ్‌లో లేదని స్పష్టం చేసింది. ‘‘ 2009 జనవరి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి సవరించిన డీపీఆర్‌ రాలదేని, 2005-06 ధరల ప్రకారం ₹10,151.04 కోట్లతో ప్రాజెక్టు డీపీఆర్‌ ఆమోదించారు. ప్రాజెక్టు వ్యయం సవరించిన అంచనాలను అడ్వైజరీ కమిటీ కూడా 2011, 2019లో ఆమోదించింది’’ అని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ పైవిధంగా సమాధానమిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని