TSLPRB: ఆ ఒక్క స్టేడియంలో.. పోలీసు అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వాయిదా
సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించాల్సిన మహిళా పోలీసు అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వర్షం కారణంగా వాయిదాపడ్డాయి. మైదానం తడిగా ఉండడంతో పరీక్షలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
సరూర్నగర్: హైదరాబాద్లోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో మహిళా పోలీసు అభ్యర్థులకు సోమవారం నిర్వహించాల్సిన దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడ్డాయి. వర్షం కారణంగా పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఏఆర్ హెడ్క్వార్టర్స్ అదనపు డీసీపీ షమీర్ మాట్లాడుతూ.. వర్షం కారణంగా పరీక్షల నిర్వహణకు మైదానం అనుకూలంగా లేదన్నారు. సోమవారం జరగాల్సిన ఈవెంట్స్ని వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన తిరిగి నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇవాళ దేహదారుఢ్య పరీక్షలకు సుమారు 1200 మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. ఇవాళ ఉదయం కొంత మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి అయిందని డీసీపీ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.