AP Police Recruitment: ఏపీలో పోలీసు నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాలకు సంబంధించి మొత్తంగా 6,100 కానిస్టేబుల్‌, 411 ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. 

Updated : 20 Dec 2022 13:24 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాలకు సంబంధించి మొత్తంగా 6,100 కానిస్టేబుల్‌, 411 ఎస్సై పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వాటిలో 315 ఎస్‌ఐ, 96 రిజర్వ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌, 3,580 కానిస్టేబుల్ (సివిల్‌), ఏపీఎస్పీలో 2,520 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. కానిస్టేబుల్‌ పోస్టులకు జనవరి 22న, ఎస్సై పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమనరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఎస్ఐ పోస్టులకు డిసెంబరు 14 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తులు స్వీకరించగా.. ఫిబ్రవరి 19న ప్రిలిమ్స్‌ పరీక్ష ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని