Andhra News: రైతుల పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు.. పసలపూడి వద్ద ఉద్రిక్తత
అమరావతి రైతుల పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఐడీ కార్డులు చూపించి ముందుకు సాగాలని చెప్పడంతో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం.. తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో పలువురు రైతులు, ఐకాస నేతలకు గాయాలయ్యాయి.
కోనసీమ: అమరావతి రైతుల పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఉదయం రాయవరంలో యాత్ర ప్రారంభమై.. మధ్యాహ్నం భోజన విరామ సమయానికి అంబేడ్కర్ కోనసీమ జిల్లా పసలపూడికి చేరుకుంది. భోజనం చేసిన తరువాత రైతులు యాత్ర ప్రారంభించగానే పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఐడీ కార్డులు చూపించి ముందుకు సాగాలని రామచంద్రాపురం డీఎస్పీ ఎం.బాలచంద్రారెడ్డి, అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి చెప్పడంతో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం.. తోపులాట చోటుచేసుకుంది.
ఇన్నాళ్లుగా యాత్ర చేస్తున్న తమను అడ్డుకోవడం ఏంటని రైతులు ప్రశ్నించారు. దీంతో పోలీసులు వారిని ముందుకు కదలనివ్వలేదు. ట్రాఫిక్కు ఇబ్బంది కలిగిస్తున్నారంటూ రైతులను పోలీసులు నెట్టివేయడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. అయినప్పటికీ రైతులు జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ ముందు కదిలే ప్రయత్నం చేయడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో పలువురు రైతులు, ఐకాస నేతలకు గాయాలయ్యాయి. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా రైతులు రోడ్డుపైనే బైఠాయించి నినాదాలు చేశారు. పోలీసులు మాత్రం ఐడీ కార్డులు చూపించిన తర్వాత మాత్రమే ముందుకు సాగాలని తేల్చి చెప్పారు.
హైకోర్టు ఆర్డర్ కాపీ చూపించండి: శివారెడ్డి
ఇన్ని రోజులుగా ఐడీ కార్డులు అడగని పోలీసులకు ఇవాళే ఎందుకు గుర్తుకొచ్చాయని ఐకాస నేతలు శివారెడ్డి, తిరుపతిరావు ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలతోనే యాత్రను అడ్డుకున్నామని చెబుతున్న పోలీసులు.. ఆర్డర్కాపీ మాత్రం చూపించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన పాదయాత్ర కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు. ‘600 మందికి మాత్రమే హైకోర్టు అనుమతి ఇచ్చింది.. వారు మాత్రమే యాత్రలో ఉండాలని పోలీసులు చెప్పారు. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రజలు రోడ్డు పక్కన నిల్చుని మద్దతు తెలపాలి’ అని పోలీసుల సూచన మేరకు శివారెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతరం పాదయాత్ర ముందుకు సాగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్